Political News

లోకేష్‌కు అష్ట‌దిగ్బంధ‌నం.. వైసీపీ వ్యూహం

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తాయనేది ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అలా వ‌చ్చి న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ముందుకు సాగి.. విజ‌యాలు అందుకునే వారు మాత్రమే నాయకులుగా మిగులుతారు. ‌రే.. ఈ విష‌యం అలా ఉంచితే.. టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ టార్గెట్‌లో ముందున్నార‌నేది.. తాజాగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం . గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు.

అయితే. అప్ప‌ట్లో లోకేష్‌ను వైసీపీ అస‌లు ప‌ట్టించుకోలేదు. టీడీపీకి ఉన్న అనేక నాయ‌కుల్లో లోకేష్‌ను ఒక నాయ‌కుడిగా.. కూడా చూడ‌లేదు.. ఏం పోటీ ఇస్తాడు..  అస‌లు లోకేష్ కూడా నాయ‌కుడేనా? అని కొడాలి నాని వంటివారు.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వంటివారు.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే.. అప్ప‌టి ఎన్నిక‌లు అయిపోయాయి. నారా లోకేష్ ఓడిపోయారు. నిజానికి ఈ ప‌రిణామాల త‌ర్వాత .. వైసీపీ అదే ప‌ద్ధ‌తిని కొన‌సాగించి ఉండాలి.

ఎందుకంటే.. లోకేష్‌లో ద‌మ్ములేద‌ని.. చెబుతున్నారు కాబ‌ట్టి.. 2019 ఎన్నిక‌ల‌కుముందు ఎంత లైట్ తీసు కున్నారో.. ఇప్పుడు కూడా అంతే లైట్ తీసుకోవాలి. కానీ, వైసీపీ అలా లైట్ తీసుకోవ‌డం లేదు. లోకేష్‌కు బ‌లంగా ఉన్నార‌ని భావిస్తున్న కీల‌క నాయ‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. టీడీపీ కంచుకోట‌గా భావించే సామాజిక వ‌ర్గంలో చీలిక‌లు తెస్తోంది. మ‌రిఇవ‌న్నీ ఎందుకు జ‌రుగుతున్నాయంటే.. 2019కి ముందు.. త‌ర్వాత‌.. నారా లోకేష్‌లో వ‌చ్చిన రాజ‌కీయ పెనుమార్పులే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు.

రాజ‌కీయంగా ప‌దునైన వ్యాఖ్య‌లు సంధించ‌డం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఐకాన్‌గా మారుతుండ‌డం వంటివి వైసీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీ ప‌గ్గాలు అందుకునేందుకు .. 2024 ఎన్నిక‌ల‌ను లోకేష్ ఒక వార‌ధిగా భావిస్తున్నార‌నే చ‌ర్చ కూడా వైసీపీలో జ‌రుగుతోంది. ఆయ‌న క‌నుక గెలిస్తే.. టీడీపీని నిలువ‌రించ లేమ‌ని.. కాబ‌ట్టి.. ఆయ‌న‌ను ఓడించ‌డ‌మే ముందున్న ల‌క్ష్య‌మ‌ని.. వైసీపీ నాయకులు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే లోకేష్‌ను అన్ని వైపుల నుంచి అష్ట‌దిగ్భంధ‌నం చేసేలా.. రాజ‌కీయంగా.. ఆయ‌న‌కు అననుకూల ప‌రిస్థితులు క‌ల్పించేలా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మంగ‌ళగిరిలో బ‌ల‌మైన టీడీపీనాయ‌కులకు ప‌ద‌వులు, సొమ్ములు ఎర‌వేస్తున్నార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇదంతా కూడా .. టీడీపీ యువ నాయ‌కుడినినైతికంగా దెబ్బ‌తీయడం ద్వారా.. పార్టీ లేకుండా చేయాల‌నే వ్యూహ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప‌రిణామాల‌ను లోకేష్ ఎలా నెగ్గుకు వ‌స్తారో చూడాలి.

This post was last modified on August 31, 2022 8:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

20 minutes ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

23 minutes ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

28 minutes ago

హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రేమ

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…

3 hours ago

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

9 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

9 hours ago