Political News

అమ‌రావ‌తి ఉద్య‌మంపై ర‌ఘురామ‌కృష్ణం రాజు కామెంట్

ర‌ఘురామ కృష్ణంరాజు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా నిలుస్తున్న వ్య‌క్తి. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ధిక్క‌రిస్తూ ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. పార్టీ నాయ‌క‌త్వాన్ని, నేత‌ల్ని ఏమాత్రం లెక్క చేయ‌కుండా చెడామ‌డా తిట్టేస్తున్నారాయ‌న‌. వివిధ అంశాల‌పై ఆయ‌న అభిప్రాయాలు చాలా సూటిగా ఉంటూ.. పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నాయి. కొన్ని నెల‌ల కింద‌ట్నుంచే ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న ర‌ఘురామ‌కృష్ణం రాజు.. ఇప్పుడు ఇంకా వాడి పెంచారు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మంపై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై ఆయ‌న కొంచెం సున్నితంగానే స్పందించారు.

నా ప్ర‌భుత్వానికి ఇది నా విన్న‌పం అంటూ.. ప్ర‌భుత్వానికి కొన్ని సూచ‌న‌లు చేశారు ర‌ఘురామ‌కృష్ణం రాజు. అమరావతి రైతుల ఉద్యమం 200 రోజులకు చేరుకున్న నేప‌థ్యంలో వారికి ర‌ఘురామ‌కృష్ణం రాజు సంఘీభావం తెలిపారు. రాజధానిపై ప్ర‌భుత్వం ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ఆయ‌న‌న్నారు. అమ‌రావ‌తి రైతుల అంకితభావం గొప్పదని, రోజూ వారిని గమనిస్తున్నానని ఆయన చెప్పారు. వైసీపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి కొనసాగుందని అన్నారని, నిండు సభలో జగన్ కూడా అదే చెప్పారని ర‌ఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించాలన్న ఆయ‌న‌.. రాజ‌ధాని విష‌య‌మై సూచనలు, సలహాలను ప్రభుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.

This post was last modified on July 5, 2020 12:59 am

Share
Show comments
Published by
suman

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

12 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

43 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago