మార్కెట్లోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలో పాపులర్ అయిన యాప్ టిక్ టాక్. యువతను ఓ ఊపు ఊపింది. అయితే… ఇది ఎన్నో అరాచకాలకు అపార్థాలకు అక్రమసంబంధాలకు కూడా దారితీసింది. నేరాలకు, సైకోలకు, శాడిస్టులకు కూడా ఇది ఉపయోగపడింది. అలా అని అన్నీ ఇందులో చెడే ఉందనీ కాదు. దీనివల్ల ఎన్నో జుగాడ్ ఐడియాలు ప్రపంచానికి తెలిశాయి. ఇంకా ఎందరో టీవీ, సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. స్టార్లుగా మారి రాజకీయ నేతలు అయిన వారు కూడా ఉన్నారు. దీని మంచి చెడులు పక్కన పెడితే … చైనా వేసిన వెధవ వేషాలకు బలైన యాప్స్ లో ఇదొకటి.
తమకు అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాను కోల్పోవడం టిక్ టాక్ కు చావు దెబ్బ. అందుకే తిరిగి ఇండియా మన్ననలు పొందడానికి టిక్ టాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక సీక్రెట్ ను వెల్లడించారు టిక్ టాక్ నిర్వహకులు. తమ యాప్ లో సేవ్ అయిన డేటా ఇమ్మని మమ్మల్ని చైనా అడగలేదు. అడిగినా మేము ఇచ్చేది లేదు. అసలు మా డేటా చైనాలో లేనేలేదు అని పేర్కొన్నారు సీఈఓ కెవిన్ మాయర్.
తమ డేటా మొత్తం సింగపూర్ లోని తమ సర్వర్లలోనే భద్రపరిచి ఉందని… అది కంపెనీ ఆధీనంలో మాత్రమే ఉందని అన్నారు. మేము ఎవరితోను ఇండియా డేటాను పంచుకోలేదన్నారు. అసలు చైనాకు దూరంగా జరగాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు కెవిన్.
ఇన్ని విషయాలు చెప్పే కెవిన్ వద్ద ఒక ప్రశ్నకు సమాధానం లేదు… ఇటీవల చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేసింది. మా టిక్ టాక్ వాడకుండా ఉండండి చాలు … మీరసలు ఉండలేరు అంటూ ఎగతాళి చేసింది. అపుడు కెవిన్ స్పందించలేదు. ఇది చైనాకు సంబంధించిన యాప్ కాదు. దీనిని ఓన్ చేసుకుని రాజకీయాలు చేయొద్దు అని ఆరోజు కెవిన్ చైనాకు కౌంటర్ ఇవ్వలేదు. ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు అంటే కెవిన్ వద్ద ఆన్సర్ లేదు. ఏదిఏమైనా… ఇప్పట్లో ఈ కంపెనీకి మళ్లీ ఇండియాలో ఎంటరయ్యే ఛాన్స్ లేదని మాత్రం అర్థమవుతుంది.
This post was last modified on July 4, 2020 8:24 pm
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…
నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…