మార్కెట్లోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలో పాపులర్ అయిన యాప్ టిక్ టాక్. యువతను ఓ ఊపు ఊపింది. అయితే… ఇది ఎన్నో అరాచకాలకు అపార్థాలకు అక్రమసంబంధాలకు కూడా దారితీసింది. నేరాలకు, సైకోలకు, శాడిస్టులకు కూడా ఇది ఉపయోగపడింది. అలా అని అన్నీ ఇందులో చెడే ఉందనీ కాదు. దీనివల్ల ఎన్నో జుగాడ్ ఐడియాలు ప్రపంచానికి తెలిశాయి. ఇంకా ఎందరో టీవీ, సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. స్టార్లుగా మారి రాజకీయ నేతలు అయిన వారు కూడా ఉన్నారు. దీని మంచి చెడులు పక్కన పెడితే … చైనా వేసిన వెధవ వేషాలకు బలైన యాప్స్ లో ఇదొకటి.
తమకు అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాను కోల్పోవడం టిక్ టాక్ కు చావు దెబ్బ. అందుకే తిరిగి ఇండియా మన్ననలు పొందడానికి టిక్ టాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక సీక్రెట్ ను వెల్లడించారు టిక్ టాక్ నిర్వహకులు. తమ యాప్ లో సేవ్ అయిన డేటా ఇమ్మని మమ్మల్ని చైనా అడగలేదు. అడిగినా మేము ఇచ్చేది లేదు. అసలు మా డేటా చైనాలో లేనేలేదు అని పేర్కొన్నారు సీఈఓ కెవిన్ మాయర్.
తమ డేటా మొత్తం సింగపూర్ లోని తమ సర్వర్లలోనే భద్రపరిచి ఉందని… అది కంపెనీ ఆధీనంలో మాత్రమే ఉందని అన్నారు. మేము ఎవరితోను ఇండియా డేటాను పంచుకోలేదన్నారు. అసలు చైనాకు దూరంగా జరగాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు కెవిన్.
ఇన్ని విషయాలు చెప్పే కెవిన్ వద్ద ఒక ప్రశ్నకు సమాధానం లేదు… ఇటీవల చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేసింది. మా టిక్ టాక్ వాడకుండా ఉండండి చాలు … మీరసలు ఉండలేరు అంటూ ఎగతాళి చేసింది. అపుడు కెవిన్ స్పందించలేదు. ఇది చైనాకు సంబంధించిన యాప్ కాదు. దీనిని ఓన్ చేసుకుని రాజకీయాలు చేయొద్దు అని ఆరోజు కెవిన్ చైనాకు కౌంటర్ ఇవ్వలేదు. ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు అంటే కెవిన్ వద్ద ఆన్సర్ లేదు. ఏదిఏమైనా… ఇప్పట్లో ఈ కంపెనీకి మళ్లీ ఇండియాలో ఎంటరయ్యే ఛాన్స్ లేదని మాత్రం అర్థమవుతుంది.
This post was last modified on July 4, 2020 8:24 pm
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…