మార్కెట్లోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలో పాపులర్ అయిన యాప్ టిక్ టాక్. యువతను ఓ ఊపు ఊపింది. అయితే… ఇది ఎన్నో అరాచకాలకు అపార్థాలకు అక్రమసంబంధాలకు కూడా దారితీసింది. నేరాలకు, సైకోలకు, శాడిస్టులకు కూడా ఇది ఉపయోగపడింది. అలా అని అన్నీ ఇందులో చెడే ఉందనీ కాదు. దీనివల్ల ఎన్నో జుగాడ్ ఐడియాలు ప్రపంచానికి తెలిశాయి. ఇంకా ఎందరో టీవీ, సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. స్టార్లుగా మారి రాజకీయ నేతలు అయిన వారు కూడా ఉన్నారు. దీని మంచి చెడులు పక్కన పెడితే … చైనా వేసిన వెధవ వేషాలకు బలైన యాప్స్ లో ఇదొకటి.
తమకు అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాను కోల్పోవడం టిక్ టాక్ కు చావు దెబ్బ. అందుకే తిరిగి ఇండియా మన్ననలు పొందడానికి టిక్ టాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక సీక్రెట్ ను వెల్లడించారు టిక్ టాక్ నిర్వహకులు. తమ యాప్ లో సేవ్ అయిన డేటా ఇమ్మని మమ్మల్ని చైనా అడగలేదు. అడిగినా మేము ఇచ్చేది లేదు. అసలు మా డేటా చైనాలో లేనేలేదు అని పేర్కొన్నారు సీఈఓ కెవిన్ మాయర్.
తమ డేటా మొత్తం సింగపూర్ లోని తమ సర్వర్లలోనే భద్రపరిచి ఉందని… అది కంపెనీ ఆధీనంలో మాత్రమే ఉందని అన్నారు. మేము ఎవరితోను ఇండియా డేటాను పంచుకోలేదన్నారు. అసలు చైనాకు దూరంగా జరగాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు కెవిన్.
ఇన్ని విషయాలు చెప్పే కెవిన్ వద్ద ఒక ప్రశ్నకు సమాధానం లేదు… ఇటీవల చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేసింది. మా టిక్ టాక్ వాడకుండా ఉండండి చాలు … మీరసలు ఉండలేరు అంటూ ఎగతాళి చేసింది. అపుడు కెవిన్ స్పందించలేదు. ఇది చైనాకు సంబంధించిన యాప్ కాదు. దీనిని ఓన్ చేసుకుని రాజకీయాలు చేయొద్దు అని ఆరోజు కెవిన్ చైనాకు కౌంటర్ ఇవ్వలేదు. ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు అంటే కెవిన్ వద్ద ఆన్సర్ లేదు. ఏదిఏమైనా… ఇప్పట్లో ఈ కంపెనీకి మళ్లీ ఇండియాలో ఎంటరయ్యే ఛాన్స్ లేదని మాత్రం అర్థమవుతుంది.
This post was last modified on July 4, 2020 8:24 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…