కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ అవుతున్నారా ? మీడియా రిపోర్టుల ప్రకారం అవుననే అనుకోవాలి. 21వ తేదీన మునుగోడులో బహిరంగసభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు. ముందుగా ప్రకటించి అమిత్ పర్యటన ప్రకారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని నేరుగా మునుగోడుకు వెళ్ళాలి. అక్కడ బహిరంగసభ చూసుకుని ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి హైదరాబద్ చేరుకోవాలి. హైదరాబద్ లో కొందరు నేతలతో కాసేపు మాట్లాడుకుని ఢిల్లీకి వెళ్ళిపోతారు.
అయితే షా పర్యటనలో మార్పులు జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మునుగోడు నుండి తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్లో కాకుండా రోడ్డుమార్గాల వస్తారని. ఎందుకంటే మధ్యలో రామోజీ ఫిల్మ్ సిటిలో కాసేపు అమిత్ షా ఆగుతారట. ఫిల్మ్ సిటీలో ఆగటం ఎందుకంటే రామోజీరావు, చంద్రబాబుతో సమావేశం అవ్వటానికే అని ప్రచారం జరుగుతోంది. బహుశా రెండురాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తుల విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ లేదా పార్లమెంటులో బిల్లులకు కానీ అడగకుండానే టీడీపీ ఎన్డీయేకి మద్దతు ప్రకటిస్తోంది. నరేంద్రమోడీతో మళ్ళీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలన్నది చంద్రబాబు ఆలోచన. పొత్తులు పెట్టుకోవటం, విడిపోవటం చాలాపార్టీల మధ్య జరుగుతున్నదే. కాబట్టి చంద్రబాబు ఆలోచనను తప్పు పట్టాల్సిందే మీ లేదు.
ఏపీ కన్నా ముందు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణాలో ఎన్నికలతో పాటు ఇపుడు మునుగోడు ఉపఎన్నికలో తన ఓట్లన్నింటినీ బీజేపీకి వేయించేట్లుగా చంద్రబాబు హామీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే తెలంగాణాలో బీజేపీకి చంద్రబాబు సహకరించాలి. అలాగే ఏపీలో చంద్రబాబుకు బీజేపీ సహకరించాలనేది ఒప్పందమట. ఇదే ఖాయమైతే తెలంగాణాలో బీజేపీకి ఏమేరకు సహకరించగలదు ? అలాగే ఏపీలో బీజేపీకి ఏముందని టీడీపీకి సహకరిస్తుందనేది ఎన్నికల్లో కానీ తేలదు. మొత్తానికి ఏపీలో మిత్రపక్షాలతో టీడీపీ కలవటం మంచిదే.
This post was last modified on August 20, 2022 5:23 pm
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…