కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ అవుతున్నారా ? మీడియా రిపోర్టుల ప్రకారం అవుననే అనుకోవాలి. 21వ తేదీన మునుగోడులో బహిరంగసభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు. ముందుగా ప్రకటించి అమిత్ పర్యటన ప్రకారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని నేరుగా మునుగోడుకు వెళ్ళాలి. అక్కడ బహిరంగసభ చూసుకుని ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి హైదరాబద్ చేరుకోవాలి. హైదరాబద్ లో కొందరు నేతలతో కాసేపు మాట్లాడుకుని ఢిల్లీకి వెళ్ళిపోతారు.
అయితే షా పర్యటనలో మార్పులు జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మునుగోడు నుండి తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్లో కాకుండా రోడ్డుమార్గాల వస్తారని. ఎందుకంటే మధ్యలో రామోజీ ఫిల్మ్ సిటిలో కాసేపు అమిత్ షా ఆగుతారట. ఫిల్మ్ సిటీలో ఆగటం ఎందుకంటే రామోజీరావు, చంద్రబాబుతో సమావేశం అవ్వటానికే అని ప్రచారం జరుగుతోంది. బహుశా రెండురాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తుల విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ లేదా పార్లమెంటులో బిల్లులకు కానీ అడగకుండానే టీడీపీ ఎన్డీయేకి మద్దతు ప్రకటిస్తోంది. నరేంద్రమోడీతో మళ్ళీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలన్నది చంద్రబాబు ఆలోచన. పొత్తులు పెట్టుకోవటం, విడిపోవటం చాలాపార్టీల మధ్య జరుగుతున్నదే. కాబట్టి చంద్రబాబు ఆలోచనను తప్పు పట్టాల్సిందే మీ లేదు.
ఏపీ కన్నా ముందు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణాలో ఎన్నికలతో పాటు ఇపుడు మునుగోడు ఉపఎన్నికలో తన ఓట్లన్నింటినీ బీజేపీకి వేయించేట్లుగా చంద్రబాబు హామీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే తెలంగాణాలో బీజేపీకి చంద్రబాబు సహకరించాలి. అలాగే ఏపీలో చంద్రబాబుకు బీజేపీ సహకరించాలనేది ఒప్పందమట. ఇదే ఖాయమైతే తెలంగాణాలో బీజేపీకి ఏమేరకు సహకరించగలదు ? అలాగే ఏపీలో బీజేపీకి ఏముందని టీడీపీకి సహకరిస్తుందనేది ఎన్నికల్లో కానీ తేలదు. మొత్తానికి ఏపీలో మిత్రపక్షాలతో టీడీపీ కలవటం మంచిదే.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…