Political News

ఇందుకు కదా చంద్రబాబును విమర్శించేది ?

రాజకీయాలన్నాక విమర్శలు చేయాలి. కానీ.. చేసేవి ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉండాలి. అంతేకాదు.. ఇదెక్కడి గోలండి? ప్రభుత్వం చేసే ప్రతి పనిని అదే పనిగా విమర్శించటం మినహా మరింకేమీ పని ఉండదా? అన్న భావన కలుగక కూడదు. ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ విషయాన్ని వదిలేసి.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ అదే పనిగా విమర్శించే ధోరణి ప్రజలకు చిరాకు తెప్పించక మానదు.

తాజాగా ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీరు ఇప్పుడిలానే ఉంది. రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున అంబులెన్సుల్ని ప్రారంభించిన వైనం అందరిని ఆకర్షించింది. ఒకేసారి ఇంత భారీగా ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకూ మరే రాష్ట్రంలోనూ చూసింది లేదు. అందునా మాయదారి రోగం విరుచుకుపడుతున్న వేళలో.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వందలాది అంబులెన్సుల్ని అందుబాటులోకి తెచ్చి.. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను కళ్లకు కట్టేలా చూపించటంలో జగన్ సర్కారు సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

ఇలాంటి సమయంలో విమర్శలు చేస్తే.. ఉన్న మర్యాద కూడా పోతుంది. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని కూడా ఇలానే విమర్శిస్తారా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అంబులెన్సులపై చంద్రబాబు చేసిన విమర్శల్ని చూస్తే.. అంత అనుభవం ఉన్న అధినేత మాటలు ఇలానా ఉండేవన్న భావన కలుగక మానదు.

రాష్ట్రంలో ఇప్పుడే మొదటిసారి అంబులెన్సులు పెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. తమ ప్రభుత్వ హయాంలో 1800 అంబులెన్సులు కొన్నట్లు పేర్కొన్నారు. సంచాన వైద్యశాలలు పెట్టామని.. తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్ని ఏర్పాటు చేశామని.. చనిపోయిన వారికి గౌరవప్రదంగా ఇంటికి చేర్చే మహాప్రస్థానం వాహనాల్ని పెట్టినట్లుగా లిస్టు చెప్పుకొచ్చారు.

ఇవన్నీ చేసినా కానీ ప్రజలు రిజెక్టు చేశారంటే.. చేసిన కార్యక్రమాలుప్రజల వరకూ అయినా వెళ్లకుండా ఉండాలి. లేదంటే.. ప్రజల మనసుల్ని దోచేలా ఈ కార్యక్రమాల్ని నిర్వహించటంలో ఫెయిల్ అయి ఉండాలి. ఎన్నికల్లో ఓటమిపాలై ఏడాది అయిన వేళ.. గతంలో తాము చేసిన పనుల చిట్టా చదివే బదులు.. అధికారపక్షం ఇరుకున పడేలా విమర్శలు.. ఆరోపణలు చేస్తే లాభం ఉంటుంది.

అంతేకానీ.. ప్రభుత్వం చేసిన మంచి పనిని అభినందించే గుణం తనలో లేదన్న విషయాన్ని చిన్నపిల్లాడికి సైతం అర్థమయ్యేలా వ్యాఖ్యానించటం సరికాదన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది. అనవసరమైన విషయాల్ని కెలికి విమర్శలు చేయటం ద్వారా తనను అభిమానించే వారు సైతం తలపట్టుకునేలా చేయటంలో బాబు తర్వాతే ఎవరైనా అన్న విషయం తాజాగా మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.

This post was last modified on July 3, 2020 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

44 minutes ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

3 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

4 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

4 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

4 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

7 hours ago