Political News

రౌడీషీటర్లు రెచ్చిపోయి 8 మంది పోలీసుల్ని కాల్చేశారు

ఉత్తరప్రదేశ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ ఇప్పుడు వాస్తవంగా చోటు చేసుకుంది. దేశంలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చోటు చేసుకున్న వైనాన్ని యూపీ పోలీసులు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

కాన్పూరు శివారులో జరిగిన ఈ ఘటన పెనుసంచలనంగా మారింది. కాన్పూరు శివారులోని చైబెపూర్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో బిక్రూ గ్రామంలో వికాస్ దూబే అనే రౌడీ షీటర్ ను పట్టుకునేందుకు పోలీసుల బృందం వెళ్లింది. ఊహించని రీతిలో రౌడీషీటర్ బృందం పోలీసుల మీదకు కాల్పులకు తెగబడింది. ఊహించని ఈ పరిణామానికి సిద్ధంగా లేకపోవటంతో ఎనిమిది మంది పోలీసులు మరణించారు.

మరణించిన వారిలో డీఎస్పీ నుంచి కానిస్టేబుళ్ల వరకూ ఉండటం గమనార్హం. మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. డీఎస్పీ దేవేంద్ర మిశ్రా.. ముగ్గురు ఎస్ఐలు.. నలుగురు కానిస్టేబుళ్లు రౌడీషీటర్ల కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్నంతనే అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్).. కాన్పూర్ ఎస్పీ.. ఐజీతో సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున పోలీసుల్ని కాల్చివేసిన రౌడీషీటర్లను వెంటనే పట్టుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. జరిగిన ఘటనపై దిగ్భాంత్రి వ్యక్తం చేసిన ఆయన.. హుటాహుటిన అదనపు బలగాల్ని రంగంలోకి దించారు. ఈ మొత్తం ఉదంతంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితుల్ని యుద్ధ ప్రాతిపదికన పట్టుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున గాలింపు చర్యల్ని పోలీసులు చేపట్టారు.

This post was last modified on July 3, 2020 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేని కాజల్.. తెలుగులో వెబ్ సిరీస్

కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…

2 hours ago

వంట సామాగ్రితో రెడీగా ఉండండి… దీదీ హాట్ కామెంట్స్!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…

5 hours ago

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…

8 hours ago

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

9 hours ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

9 hours ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

10 hours ago