రాజంపేట…రాజకీయాలు ఎవరికీ అంతుబట్టవు. ఎందుకంటే.. కడప జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ కుటుంబానికి హవా మామూలుగా ఉండదనే పేరుంది. అయితే.. ఒక్క రాజంపేటలో మాత్రం.. రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ టీడీపీ నేతలు గెలిచారు.. కాంగ్రెస్ నేతలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. తర్వాత.. వైసీపీ నేతలకు కూడా ఛాన్స్ ఇచ్చారు. 2014లో టీడీపీ అభ్యర్థి.. మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు.
కడప మొత్తంలో టీడీపీ సాధించిన ఏకైక విజయం ఇది ఒక్కటే. అయితే.. ఆయన తర్వాత.. వైసీపీ పంచన చేరి.. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై మరోసారి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మళ్లీ మేడా టీడీపీవైపు చూస్తున్నారనేచర్చ జరుగుతోంది. రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని.. తెరమీదికి వచ్చిన ఉద్యమాల్లో మేడా కుటుంబం కూడా పాల్గొంది.
దీనికి సంబంధించి ఆయన ఏకంగా సీఎం జగన్తోనూ భేటీ అయ్యారు. అయినా.. రాయచోటినే జిల్లా కేం ద్రంగా ప్రకటించారు. ఇది మేడాను హర్ట్ చేసింది. దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ కార్యక్రమాలకు దూరం గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అవకాశం కోసం.. ఎదురు చూస్తున్నారు. ఘర్ వాపసీ మంత్రాన్ని సైతం పఠిస్తున్నారు. ఇది వర్కవుట్ అయితే..మేడాకు టీడీపీ టికెట్ ఖాయం. ఇక,వైసీపీ తరఫున ఏకంగా.. జగనే ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడాల్సి ఉంది.
మరోవైపు.. బీజేపీ తరఫున మాజీ మంత్రి.. చడిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయను న్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన.. మంత్రి అయ్యారు. అయితే.. ఆ తర్వాత.. మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయన రాజంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. దీంతో రాజంపేట నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఇక, ఇక్కడి ప్రజలు కానిస్టెంట్గా అయితే ఉండరు. అన్ని పార్టీలనూ ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కుతారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on August 8, 2022 10:45 am
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…
పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…