Political News

ఆ 59 యాప్స్‌పై నిషేధం.. 45 వేల కోట్ల నష్టం?

ఇండియాలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లను ఆపితే ఆ దేశానికి నష్టం కానీ.. చైనా యాప్‌లను నిషేధిస్తే వచ్చే నష్టమేంటి అన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. కానీ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయం గురించి తక్కువ అంచనా వేస్తే తప్పే అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ యాప్‌గా ఉన్న టిక్ టాక్‌తో పాటు మరో పాపులర్ యాప్ ‘హలో’.. ఇంకొన్ని చైనా యాప్‌ల యాజమాన్య సంస్థ ‘బైట్ డ్యాన్స్’.. ఈ యాప్‌లను ఇండియాలో నిషేధించడం వల్ల ఏకంగా 6 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో చెప్పాలంటే 45 వేల కోట్ల పైగానే నష్టపోనుందట.

ఒక్క మే నెలలోనే ‘టిక్ టాక్’ యాప్‌ను 11 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో మెజారిటీ డౌన్ లోడ్లు ఇండియాలోనే జరిగాయి. దీన్ని బట్టి దేశంలో ఆ యాప్ ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వేల కోట్ల ఆదాయం పొందుతోంది బైట్ డ్యాన్స్.

ఆ సంస్థ మరిన్ని యాప్‌లను లాంచ్ చేయడానికి, ఉన్న యాప్‌లను వృద్ధి చేసి మరింతగా విస్తరించడానికి భారీగా ప్రణాళికలు రచించుకుంది. ఇందుకోసం బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7500 కోట్లు) దాకా పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమైంది. భారత ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పుడు వస్తున్న ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో రాబట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆదాయం.. మొత్తం కలిపితే ఆ సంస్థకు నష్టం రూ.45 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా.

కేవలం యాప్‌ల ద్వారా ఇంత ఆదాయం వస్తోందంటే.. ఇక వివిధ రకాల ఉత్పత్తులు, ముడిసరుకు ఎగుమతుల ద్వారా చైనా ఇండియా నుంచి ఎన్ని లక్షల కోట్ల ఆదాయం పొందుతూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు దేశంలో ఆ దేశానికి చెందిన కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అనేక రకాలుగా చైనాపై ఆధారపడి ఉండటం వల్ల పూర్తిగా ఆ దేశంతో తెగతెంపులు చేసుకోవడం కష్టం కానీ.. యాప్‌ల నిషేధంతో పాటు పెట్టుబడుల విషయంలో నియంత్రణ పాటిస్తే చైనాను గట్టిగానే దెబ్బ తీసినట్లు అవుతుందన్నది నిపుణుల మాట.

This post was last modified on July 3, 2020 1:01 am

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

40 minutes ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

1 hour ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

1 hour ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

2 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

5 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

5 hours ago