మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న సంగతి తెలిసిందే. తీవ్రమైన జ్వరం, విపరీతమైన పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు…ఇవి కరోనా సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు. వీటితో పాటు అసలు ఏ లక్షణాలు లేకుండా కూడా కరోనా బారిన పడ్డవారూ ఉన్నారు. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపే ఈ ప్రాణాంతక వైరస్….శ్వాస సంబంధిత రోగాలతో బాధపడే వారిని తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. ఈ నేపథ్యంలో పారిస్ లో ఓ కరోనా పాజిటివ్ రోగిలో ఓ వింత లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. కరోనా బారిన పడ్డ 62 ఏళ్ల రోగి పురుషాంగం నాలుగు గంటలపాటు స్తంభించి ఉండడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. కరోనా సోకడం వల్ల ఆ రోగి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగలేదని, పురుషాంగంలో రక్తం సరఫరాలో అంతరాయం వల్ల అంగం అంతసేపు స్తంభించిందని వారు గుర్తించారు. ఈ రకమైన పరిస్థితిని ప్రియాపిజమ్ అంటారని, గతంలో ఆ రోగికి అ అటువంటిది ఎపుడూ జరగలేదని వైద్యులు గుర్తించారు.
ఆ రోగి రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు….నలుపు రంగులో రక్తం గట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆ రోగి శరీరంలో అధికశాతంలో కార్బన్ డయాక్సైడ్, తక్కువ శాతంలో ఆక్సిజన్ శాతాలున్నాయని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరేటపుడు ఆ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని…14 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన తర్వాత వెంటిలేటర్ తొలగించామని తెలిపారు. అయితే, ఏప్రిల్ నెలలోనూ ఈ రకంగా కొందరు కరోనా పాజిటివ్ రోగుల్లో రక్తం గడ్డకట్టిన దాఖలాలున్నాయని, కానీ, ఈ రోగి మాదిరిగా ప్రియాపిజమ్ లక్షణాలు లేవని తెలిపారు. రక్తం గడ్డ కట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్తప్రసరణ సరిగా జరగదని, అటువంటి సందర్భంలో రోగిలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల్లో ఈ స్థితి ఎందుకు వస్తుందన్న దానిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…