మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న సంగతి తెలిసిందే. తీవ్రమైన జ్వరం, విపరీతమైన పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు…ఇవి కరోనా సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు. వీటితో పాటు అసలు ఏ లక్షణాలు లేకుండా కూడా కరోనా బారిన పడ్డవారూ ఉన్నారు. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపే ఈ ప్రాణాంతక వైరస్….శ్వాస సంబంధిత రోగాలతో బాధపడే వారిని తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. ఈ నేపథ్యంలో పారిస్ లో ఓ కరోనా పాజిటివ్ రోగిలో ఓ వింత లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. కరోనా బారిన పడ్డ 62 ఏళ్ల రోగి పురుషాంగం నాలుగు గంటలపాటు స్తంభించి ఉండడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. కరోనా సోకడం వల్ల ఆ రోగి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగలేదని, పురుషాంగంలో రక్తం సరఫరాలో అంతరాయం వల్ల అంగం అంతసేపు స్తంభించిందని వారు గుర్తించారు. ఈ రకమైన పరిస్థితిని ప్రియాపిజమ్ అంటారని, గతంలో ఆ రోగికి అ అటువంటిది ఎపుడూ జరగలేదని వైద్యులు గుర్తించారు.
ఆ రోగి రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు….నలుపు రంగులో రక్తం గట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆ రోగి శరీరంలో అధికశాతంలో కార్బన్ డయాక్సైడ్, తక్కువ శాతంలో ఆక్సిజన్ శాతాలున్నాయని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరేటపుడు ఆ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని…14 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన తర్వాత వెంటిలేటర్ తొలగించామని తెలిపారు. అయితే, ఏప్రిల్ నెలలోనూ ఈ రకంగా కొందరు కరోనా పాజిటివ్ రోగుల్లో రక్తం గడ్డకట్టిన దాఖలాలున్నాయని, కానీ, ఈ రోగి మాదిరిగా ప్రియాపిజమ్ లక్షణాలు లేవని తెలిపారు. రక్తం గడ్డ కట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్తప్రసరణ సరిగా జరగదని, అటువంటి సందర్భంలో రోగిలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల్లో ఈ స్థితి ఎందుకు వస్తుందన్న దానిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు.
This post was last modified on July 2, 2020 7:33 pm
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…