Political News

యుద్ధప్రాతిపదికన భారత్ కు 2000 బాంబులు.. ఇజ్రాయిల్ రెఢీ

నోరు మంచిదైతే ఊరు మంచిదని ఊరికే అనలేదు. తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుదేశాలకు స్వయంగా వెళ్లిన ప్రధానమంత్రి మోడీ.. అందరికి స్నేహహస్తాన్ని చాచటమే కాదు.. అందరితోనూ కలుపుకుపోయే గుణాన్ని ప్రదర్శించారు. అంతేకాదు.. దశాబ్దాలకు దశాబ్దాల పర్యంతం ప్రధాని హోదాలో వెళ్లని దేశాలకు వెళ్లటం ద్వారా మోడీ పలు రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఒకట్రెండు ఏళ్ల పాటు అదే పనిగా పలు దేశాల్లో పర్యటించటం ద్వారా స్నేహసంబంధాల్ని పటిష్టం చేసుకోవటంలో సక్సెస్ అయిన మోడీకి.. ఇప్పుడవన్ని సమయానికి కలిసి వస్తున్నాయి.

ఇటీవల చైనా.. పాక్ లతో భారత్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. యుద్ధ ప్రాతిపదికన స్పైస్2000 బాంబుల్ని భారత వైమానిక దళానికి ఇచ్చేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే రూ.500 కోట్ల లోపు ఆయుధాల్ని కొనుగోలు చేసుకునేందుకు భారత రక్షణ దళాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

గత ఏడాది పాక్ లోని బాలకోట్ లోని తీవ్రవాద స్థావరాలపై నిర్వహించిన సర్జికల్ స్టైక్స్ లో వినియోగించిన బాంబులు ఇవే. వీటినిఫ్రాన్స్ లో తయారైన మిరాజ్ 2000 జెట్స్ ద్వారా వినియోగిస్తారు. గగనతలం నుంచి భూతలంలోని లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈ బాంబులు సాయం చేస్తాయి. శత్రుదేశాల బంకర్లు.. భవంతుల్ని క్షణాల్లో పూర్తిగా నేలమట్టం చేసే సామర్థ్యం ఈ బాంబుల సొంతం.

ఈ బాంబుల్ని ఇప్పటికే భారత్ కొనుగోలు చేసింది. గత ఏడాది కొనుగోలు చేసిన దానికి అదనంగా మరోసారి ఈ బాంబుల్ని కొనుగోలు చేస్తోంది. స్సైస్ అంటే స్మార్ట్.. ప్రిసైజ్.. ఇంపాక్ట్.. కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ బాంబుల్ని అభివర్ణిస్తారు. ఇదిలా ఉంటే.. భారత్ కుఅవసరమైన రాఫెల్ యుద్ధ విమానాల్ని కూడా ఈ నెలాఖరు నాటికి భారత్ కు పంపుతామని ఫ్రాన్స్ సైతం చెప్పటం తెలిసిందే. ఈ విమానాలతో భారత్ మరింత శక్తివంతం కావటం ఖాయం.

This post was last modified on July 2, 2020 5:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago