Political News

దాచుకున్న సొమ్మును ప్ర‌భుత్వం వాడేసింది: ఉద్యోగ సంఘాల ఫైర్‌

ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. త‌మ సొమ్మును కూడా ప్ర‌భుత్వం వాడుకుంద‌ని.. త‌మ‌కు ఏ మాత్రం ప్రయోజ‌నాలు చేకూర్చ‌డం లేద‌ని.. వారు వాపోతున్నారు. ఒక ఉద్యోగి త‌న కూతూరు పెళ్లి కోసం జీపీఎఫ్‌ లోన్‌కు పెట్టుకుంటే మనవరాలి బారసాలకు కూడా రాలేదని ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ధ్వ‌జ‌మెత్తారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచామన్నారు.

బుధ‌వారం.. ఏపీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల నేతృత్వంలో.. మంత్రి వర్గ ఉపసంఘ సమావేశం జ‌రిగింది. దీనికి ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి హాజ‌ర‌య్యారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌య‌త్నించారు.

అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక ఉద్యోగి కూతురి పెళ్లి కోసం జీఫీఎఫ్‌ పెట్టుకుంటే మనవరాలి బారసాలకు రాలేదన్నారు. ఇదే అంశాన్ని ఉపసంఘం భేటీలో ప్రస్తావించినట్టు తెలిపారు. పీఆర్సీ డీఏ ఎరియర్స్‌ ఈ నెలాఖరుకు జమ చేస్తామన్నారని, అదీ జరగలేదని చెప్పారు. త‌మ సొమ్మును కూడా వాడేసుకుంటే.. ఎలా? అని ప్ర‌శ్నించారు.

ఉద్యోగుల హెల్త్‌ స్కీం పైనే సమావేశంలో ఎక్కువ చర్చ జరిగిందని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్ఎ్‌సను కూడా అనుమతించాలని కోరామన్నారు. ఈహెచ్ ఎస్‌లో కూడా గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆసుపత్రులకు చెల్లింపులు చేయాలని కోరామన్నారు. దీనిపై ఉత్తర్వులు ఇచ్చేలా చూస్తామని మంత్రి బొత్స, సజ్జల హామీ ఇచ్చినట్టు తెలిపారు.

ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వ ర్లు తెలిపారు. జీపీఎఫ్‌ సొమ్మును ఈ నెలాఖరుకు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికీ నెర వేరలేదన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారన్నారు. ఆరోగ్యశ్రీ మాదిరిగా అన్ని జబ్బులకూ ఈహెచ్ ఎస్ కార్డులకు కూడా వర్తించేలా చూడాలని, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ రూ.5 లక్షలకు పెంచాలని కోరామని తెలిపారు. త‌మ సొమ్ములను త‌మ‌కు త‌క్ష‌ణ‌మే జ‌మ చేయాల‌ని కోరిన‌ట్టు తెలిపారు.

This post was last modified on July 28, 2022 2:15 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

2 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

3 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

4 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

16 hours ago