Political News

ఉద్యోగులకు అస్సలు నచ్చని పని చేస్తున్న జగన్

వైసీపీలో తీవ్ర సంచ‌ల‌నంగా మారిన ఈ నినాదం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే.. మ‌నం ఇంట‌కే జ‌గ‌నన్నా.. అంటూ.. నాయ‌కులు ల‌బోదిబోమంటున్నారు. ఇంత‌కీ.. ఏం జ‌రిగింది? ఎందుకు? అంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించిన సీపీఎస్ ర‌ద్దును తొక్కి పెట్టి..రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో 4200 కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోద‌న్న వ్యాఖ్య‌లు.. మీడియాలో జోరందుకు న్నాయి. బుధ‌వారం ఈ వార్త‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి.

దీనిపై దృష్టి పెట్టిన వైసీపీ నాయ‌కులు.. ఇదే నిజ‌మైతే.. ఇక‌, మ‌న‌ల్ని కాపాడేవారు ఎవ‌రున్నారు? అనే కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఉద్యోగుల‌కు వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ హామీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాగానే.. వారంలోనే సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై నిర్ణ‌యం తీసుకోక‌పోగా.. సుదీర్ఘ ఉద్య‌మం త‌ర్వాత‌.. సీపీఎస్ పై మ‌డమ తిప్పేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం పింఛ‌న్ ప‌థ‌కం(జీపీఎస్‌)ను తెర‌మీదికి తెచ్చారు.

అయితే.. దీనికి ప్ర‌భుత్వ ఉద్యోగులు అంగీక‌రించ‌డం లేదు. కానీ, స‌ర్కారు మాత్రం.. సీపీఎస్‌పై ముందుగా త‌మ‌కు అవ‌గాహ‌న లేద‌ని.. ఇప్పుడుక‌ళ్లు తెరుచుకున్నామ‌ని.. కాబ‌ట్టి.. దీనివ‌ల్ల‌.. ఆర్థికంగా భ‌విష్య‌త్తులో రాష్ట్ర స‌ర్కారుకు క‌ష్టాలు వ‌స్తాయ‌ని.. పేర్కొంది. అందుకే.. తాము రాష్ట్ర భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని.. ఉదారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల పేర్కొన్నారు. దీంతో ఇది నిజ‌మేనేమో.. జ‌గ‌న్‌స‌ర్కారు ఏపీ భ‌విత‌కు క‌ట్టుబడిందేమో.. అని అంద‌రూ అనుకున్నారు.

క‌ట్ చేస్తే.. ఇన్నాళ్ల‌కు పార్ల‌మెంటు వేదిక‌గా.. అస‌లు వాస్త‌వాలు వెలుగు చూశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) పథకం కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి ఆ మేరకు బహిరంగ మార్కెట్‌లో కొత్త రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనుమతి పొందింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

దీంతో సీపీఎస్ ర‌ద్దు.. వెనుక‌.. వైసీపీ స‌ర్కారు చెబుతున్న‌ట్టు.. రాష్ట్ర ప్ర‌యోజనాలు.. భ‌విష్య‌త్తులో త‌లెత్త‌బోయే.. ఆర్థిక భారాలు కాదు.. ప్ర‌స్తుతం అప్పులు మాత్ర‌మే స‌ర్కారుకు ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై.. వైసీపీలోనూ తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. ఇది నిజ‌మైతే.. త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. ఉద్యోగుల‌ను మోసం చేశామ‌న్న పేరుతో పాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌నే న‌మ్మ‌కం కూడా లేద‌ని.. వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 27, 2022 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

4 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

11 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

11 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

11 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

13 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

14 hours ago