వైసీపీలో తీవ్ర సంచలనంగా మారిన ఈ నినాదం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. మనం ఇంటకే జగనన్నా.. అంటూ.. నాయకులు లబోదిబోమంటున్నారు. ఇంతకీ.. ఏం జరిగింది? ఎందుకు? అంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ రద్దును తొక్కి పెట్టి..రాష్ట్ర ప్రభుత్వం మరో 4200 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోదన్న వ్యాఖ్యలు.. మీడియాలో జోరందుకు న్నాయి. బుధవారం ఈ వార్తలు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
దీనిపై దృష్టి పెట్టిన వైసీపీ నాయకులు.. ఇదే నిజమైతే.. ఇక, మనల్ని కాపాడేవారు ఎవరున్నారు? అనే కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఉద్యోగులకు వైసీపీ అధినేతగా జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే.. వారంలోనే సీపీఎస్ను రద్దు చేస్తానని ప్రకటించారు. అయితే.. ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోగా.. సుదీర్ఘ ఉద్యమం తర్వాత.. సీపీఎస్ పై మడమ తిప్పేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పింఛన్ పథకం(జీపీఎస్)ను తెరమీదికి తెచ్చారు.
అయితే.. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు అంగీకరించడం లేదు. కానీ, సర్కారు మాత్రం.. సీపీఎస్పై ముందుగా తమకు అవగాహన లేదని.. ఇప్పుడుకళ్లు తెరుచుకున్నామని.. కాబట్టి.. దీనివల్ల.. ఆర్థికంగా భవిష్యత్తులో రాష్ట్ర సర్కారుకు కష్టాలు వస్తాయని.. పేర్కొంది. అందుకే.. తాము రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ఉదారంగా వ్యవహరిస్తున్నామని.. సలహాదారు సజ్జల పేర్కొన్నారు. దీంతో ఇది నిజమేనేమో.. జగన్సర్కారు ఏపీ భవితకు కట్టుబడిందేమో.. అని అందరూ అనుకున్నారు.
కట్ చేస్తే.. ఇన్నాళ్లకు పార్లమెంటు వేదికగా.. అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) పథకం కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి ఆ మేరకు బహిరంగ మార్కెట్లో కొత్త రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి పొందింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
దీంతో సీపీఎస్ రద్దు.. వెనుక.. వైసీపీ సర్కారు చెబుతున్నట్టు.. రాష్ట్ర ప్రయోజనాలు.. భవిష్యత్తులో తలెత్తబోయే.. ఆర్థిక భారాలు కాదు.. ప్రస్తుతం అప్పులు మాత్రమే సర్కారుకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై.. వైసీపీలోనూ తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఇది నిజమైతే.. తమకు ఇబ్బందులు తప్పవని.. ఉద్యోగులను మోసం చేశామన్న పేరుతో పాటు.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం కూడా లేదని.. వైసీపీ నాయకుల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on July 27, 2022 2:31 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…