నాన్ ఎన్డీయే పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఎలా ఓడిపోయారో అందరు చూసిందే. నామినేషన్ వేసేంతవరకు ఒకటిగా ఉన్న ప్రతిపక్షాల్లో తర్వాత చాలావరకు యశ్వంత్ కు హ్యాండిచ్చాయి. యూపీఏలో భాగస్వామి అయిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీఎం హేమంత్ సోరేన్ అధికారికంగానే ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. తర్వాత చాలామంది ఏదో కారణం చెప్పి ముర్ముకే మద్దతుగా నిలిచారు. చివరకు ముర్ము అత్యధిక మెజారిటీతో గెలిచారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి పోటీ మొదలైంది. ఆదిలోనే మమతా బెనర్జీ పెద్ద దెబ్బకొట్టారు. నాన్ ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మార్గరెట్ ఆల్వాకు మద్దతిచ్చేది లేదని ప్రకటించారు. అభ్యర్థి ఎంపికలో తృణమూల్ కాంగ్రెస్ ను పరిగణలోకి తీసుకోలేదని సాకుతో తమ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికనే బహిష్కరిస్తున్నట్లు చెప్పేసింది. నాన్ ఎన్డీయేలో అతిపెద్ద పార్టీయే చెయ్యి చేసిన తర్వాత ఇక ఆల్వాకు పడే ఓట్లు ఎన్నుంటాయి.
రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ కే పూర్తిగా ఓట్లేయని ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతిగా ఆల్వాకు వేస్తాయా ? అనుమానమే అవసరం లేదు మెల్లిగా ఒక్కోపార్టీ జారుకునేస్తుంది. ఆల్వాకు మిగిలేది తీరని పరాభవం మాత్రమే. ఇక్కడ ఓడిపోవటం అవమానం కానేకాదు. కాకపోతే పోటీకి నిలబెట్టిన పార్టీలే నూరుశాతం ఓట్లేయకపోతే అవమానం కాక మరేమిటి ? ఈ మాత్రం దానికి అసలు 84 ఏళ్ళ యశ్వంత్ ను 80 ఏళ్ళున్న ఆల్వాను పోటీలోకి ఎందుకు దింపాలి ?
అప్పుడు యశ్వంత్ అయినా ఇపుడు ఆల్వా అయినా గెలుస్తామనే నమ్మకంతో పోటీలోకి దిగుండరన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పటమే టార్గెట్ గా మొదట్లో అందరు సమావేశాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే చాలా పార్టీలు ఏదో కారణంగా ద్రౌపదికే జై కొట్టాయి. ఇపుడేమో ఏకంగా టీఎంసీ ఓటింగ్ నే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించేసింది. ఇంకెన్ని పార్టీలు ఓటింగ్ ను బహిష్కరిస్తాయో చూడాలి.
This post was last modified on July 22, 2022 11:50 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…