నాన్ ఎన్డీయే పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఎలా ఓడిపోయారో అందరు చూసిందే. నామినేషన్ వేసేంతవరకు ఒకటిగా ఉన్న ప్రతిపక్షాల్లో తర్వాత చాలావరకు యశ్వంత్ కు హ్యాండిచ్చాయి. యూపీఏలో భాగస్వామి అయిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీఎం హేమంత్ సోరేన్ అధికారికంగానే ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. తర్వాత చాలామంది ఏదో కారణం చెప్పి ముర్ముకే మద్దతుగా నిలిచారు. చివరకు ముర్ము అత్యధిక మెజారిటీతో గెలిచారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి పోటీ మొదలైంది. ఆదిలోనే మమతా బెనర్జీ పెద్ద దెబ్బకొట్టారు. నాన్ ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మార్గరెట్ ఆల్వాకు మద్దతిచ్చేది లేదని ప్రకటించారు. అభ్యర్థి ఎంపికలో తృణమూల్ కాంగ్రెస్ ను పరిగణలోకి తీసుకోలేదని సాకుతో తమ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికనే బహిష్కరిస్తున్నట్లు చెప్పేసింది. నాన్ ఎన్డీయేలో అతిపెద్ద పార్టీయే చెయ్యి చేసిన తర్వాత ఇక ఆల్వాకు పడే ఓట్లు ఎన్నుంటాయి.
రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ కే పూర్తిగా ఓట్లేయని ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతిగా ఆల్వాకు వేస్తాయా ? అనుమానమే అవసరం లేదు మెల్లిగా ఒక్కోపార్టీ జారుకునేస్తుంది. ఆల్వాకు మిగిలేది తీరని పరాభవం మాత్రమే. ఇక్కడ ఓడిపోవటం అవమానం కానేకాదు. కాకపోతే పోటీకి నిలబెట్టిన పార్టీలే నూరుశాతం ఓట్లేయకపోతే అవమానం కాక మరేమిటి ? ఈ మాత్రం దానికి అసలు 84 ఏళ్ళ యశ్వంత్ ను 80 ఏళ్ళున్న ఆల్వాను పోటీలోకి ఎందుకు దింపాలి ?
అప్పుడు యశ్వంత్ అయినా ఇపుడు ఆల్వా అయినా గెలుస్తామనే నమ్మకంతో పోటీలోకి దిగుండరన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పటమే టార్గెట్ గా మొదట్లో అందరు సమావేశాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే చాలా పార్టీలు ఏదో కారణంగా ద్రౌపదికే జై కొట్టాయి. ఇపుడేమో ఏకంగా టీఎంసీ ఓటింగ్ నే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించేసింది. ఇంకెన్ని పార్టీలు ఓటింగ్ ను బహిష్కరిస్తాయో చూడాలి.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…