Political News

కొత్త జిల్లాల‌కు 100 రోజులు.. జ‌నాల‌కు ఒరిగిందేంటి?

చెప్పాడంటే చేస్తాడంతే! అనే నినాదంతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కొనియాడే ఆ పార్టీనాయ‌కులు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఇప్పుడు పెద్ద చిక్కు వ‌చ్చింది. జ‌గ‌న్ చెప్పిన‌ట్టే.. రాష్ట్రంలోని 13 జిల్లాల ను 26 జిల్లాలుగా మార్చారు. ఈ క్ర‌మంలో కొన్ని వివాదాలు.. విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. లెక్క చేయ‌కుండా జిల్లాల విభ‌జ‌న‌చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ జిల్లాల విభ‌జ‌న‌కు 100 రోజులు పూర్తయ్యాయి. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది.

మ‌రి జ‌గ‌న్ ఆశించింది జ‌రిగినా.. జ‌నాల‌కు ఒరిగిందేంట‌నేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాల‌న మ‌రింత చేరువ అవుతుంద‌ని.. ప్ర‌జ‌ల‌కు అత్యంత స‌మీపంలోనే అధికారులు ఉంటార‌ని.. వారికి ప‌నులు కూడా అవుతాయ‌ని.. ప్ర‌భుత్వం చెప్పింది. కానీ, 100 రోజులు గ‌డిచినా.. ఎక్క‌డా అలాంటి వాతావర‌ణం క‌నిపించ‌డం లేద‌ని.. ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఇక‌, అధికారులు కూడా ఆయా జిల్లాల్లో ఎక్క‌డా ఉండడం లేదు. వారు ఉండేందుకు.. ప‌నిచేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లు లేవు.

దీంతో అధికారులు కానీ.. సిబ్బంది కానీ.. మ‌ళ్లీ పాత ప‌ద్ధితినే అనుస‌రిస్తున్నారు. ఇక‌, ప్ర‌జ‌లు కూడా ఏ కార్యాల‌యాల‌నికి వెళ్లాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. గ‌తంలో జిల్లా కేంద్రంలోనే అన్నీ ఉండేవి. కానీ, ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఏ ఆఫీసు ఎక్క‌డుందో.. ఏ అధికారిని క‌ల‌వాలో తెలియ‌క ప్ర‌జ‌లు తిప్ప‌లు పడుత‌న్నారు. కొత్త జిల్లాల‌ను అయితే.. ఆర్భాటంగా ప్ర‌క‌టించారు కానీ.. ఆ జిల్లాల‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల‌ను ఏర్పాటు చేయ‌డం లో స‌ర్కారు విఫ‌ల‌మైంది.

ఇక‌, అదేస‌మ‌యంలో జిల్లాల‌పై అధికారుల‌కు కూడా ప‌ట్టులేద‌నే వినిపిస్తోంది. ముఖ్యంగా మంత్రులు కూడా ఆఫీసులను ప‌ట్టించుకోవ‌డం లేదు. గుంటూరులోని ప‌ల్నాడు, ప‌శ్చిమ‌లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా వంటి చోట్ల ఇంకా.. క‌నీసం కార్యాల‌యాల‌ను కూడా చూపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడున్న జిల్లా కేంద్రా ల్లోనే పనులు చేస్తున్నారు. మ‌రి అధికారుల‌కే ఇన్ని తిప్ప‌లు ఉంటే.. సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్న‌. మ‌రి జిల్లాల ఏర్పాటుపై ఉన్న దూకుడు.. త‌ర్వాత లేదా? అనే సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఇదంతా చూస్తే.. తాంబూలాలిచ్చేశాం.. త‌న్నుకు చావండి.. అన్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 16, 2022 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

50 minutes ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

3 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

4 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

4 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

5 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

7 hours ago