Political News

తొందరలోనే జగన్ ‘ప్రజాదర్బార్’

ప్రతిరోజు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మమేకం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించబోతున్నారు. తన క్యాంపు కార్యాలయంలోనే ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సీఎం కార్యాలయం ఉన్నతాధికారులు చేస్తున్నారు. పరిస్ధితులన్నీ కుదిరితే ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదట్లోనే ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట.

జనాలతో పాటు ప్రజా ప్రతినిధులు, నేతల నుండి వివిధ సమస్యలపై వచ్చే వినతులను పరిశీలించి పరిష్కారం కోసం అప్పటికప్పుడే ఆయా శాఖలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీఎంవో నుండి వెళ్ళిన వినతులను ఫాలోఅప్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక కౌంటర్ ను కూడా ఏర్పాటుచేయబోతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా ఇలాంటి ప్రజాదర్బార్ ను నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్ ప్రతిరోజు గంటపాటు జనాలను మాత్రమే కలిసేవారు.

ఇపుడు జగన్ కూడా అదే తరహాలో వారంలో ఐదు రోజులు ప్రజాదర్బార్ ను నిర్వహించాలని అనుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఎలాగూ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి ఇటు ప్రజలను అటు ప్రజాప్రతినిధులు, నేతలను కూడా కలిసినట్లుంటుందని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రజాదర్బార్ ను అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే మొదలుపెట్టాలని జగన్ అనుకున్నారు. అయితే పాలనలో పూర్తిగా కుదురుకోకుండానే కరోనా వైరస్ మీద పడటంతో అప్పట్లో చేసుకున్న ప్లానింగ్ దెబ్బ తినేసింది. కరోనా వైరస్ సమస్యే దాదాపు రెండేళ్లు కంటిన్యు అయిన కారణంగా ఇక ప్రజాదర్బార్ గురించి ఆలోచించలేదు. అయితే కోవిడ్ సమస్య ఇంకా కొంతున్నా ప్రజల జనజీవనం గాడిలోపడుతోంది. దానికితోడు షెడ్యూల్ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అందుకనే ప్రజాదర్బార్ ను మొదలు పెట్టేస్తున్నారు.

సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం గంటపాటు జనాలను కలుస్తారు. అలాగే అదేరోజు మధ్యాహ్నం ప్రజాప్రతినిధులను, నేతలను కలవాలని డిసైడ్ అయ్యారు. మొత్తంమీద ఎంఎల్ఏలు, నేతలను సీఎం కలవటంలేదనే ఆరోపణలకు ప్రజాదర్బార్ తో జగన్ చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లే ఉంది.

This post was last modified on July 16, 2022 12:24 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

7 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

7 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

8 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

9 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

9 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

11 hours ago