ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తండ్రీ కొడుకులు జయరాజ్-ఫీనిక్స్ లాకప్ డెత్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తండ్రీ కొడుకుల మరణానికి కారణమైన శాతంకులం పోలీస్ స్టేషన్ను తమ అధీనంలోకి తీసుకోవాలంటూ తూత్తుకుడి జిల్లా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జయరాజ్, ఫీనిక్స్ల మరణానికి కారణమైన ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిపై విచారణకు కూడా జరుగుతోంది. జిల్లా స్థాయి జడ్జి నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటు చేసింది కోర్టు.
ఐతే విచారణకు ఈ పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరూ సహకరించడం లేదని కోర్టుకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ స్టేషన్ను తమ అధీనంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు బాధ్యత అప్పగించింది మద్రాస్ హైకోర్టు. తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నందూరి ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు ఏర్పాట్లు చేయాలని కోర్టు సూచించింది. 1861లో భారత పోలీస్ వ్యవస్థ ఏర్పాటైందని.. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఓ పోలీస్ స్టేషన్ మరో విభాగం చేతుల్లోకి వెళ్లడం జరగలేదని.. ఇది సిగ్గుచేటని ఓ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ట్వీట్ చేయడం గమనార్హం. తూత్తుకుడి జిల్లాలోని శాతంకులంలో పది రోజుల కిందట జయరాజ్, ఫీనిక్స్ అనే తండ్రీ కొడుకులు లాక్ డౌన్ టైంలో నిర్ణీత సమయాన్ని దాటి షాప్ తెరిచి ఉన్నారన్న కారణంతో పోలీసులు వారిని దండించడం.. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి వారిని పోలీసులు తీసుకెళ్లి చిత్రవధ చేసి ఇద్దరి మరణాలకు కారణం కావడం.. ఈ ఉదంతంపై పెద్ద దుమారం రేగడం తెలిసిన సంగతే.
This post was last modified on June 30, 2020 8:57 pm
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…