ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తండ్రీ కొడుకులు జయరాజ్-ఫీనిక్స్ లాకప్ డెత్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తండ్రీ కొడుకుల మరణానికి కారణమైన శాతంకులం పోలీస్ స్టేషన్ను తమ అధీనంలోకి తీసుకోవాలంటూ తూత్తుకుడి జిల్లా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జయరాజ్, ఫీనిక్స్ల మరణానికి కారణమైన ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిపై విచారణకు కూడా జరుగుతోంది. జిల్లా స్థాయి జడ్జి నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటు చేసింది కోర్టు.
ఐతే విచారణకు ఈ పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరూ సహకరించడం లేదని కోర్టుకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ స్టేషన్ను తమ అధీనంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు బాధ్యత అప్పగించింది మద్రాస్ హైకోర్టు. తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నందూరి ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు ఏర్పాట్లు చేయాలని కోర్టు సూచించింది. 1861లో భారత పోలీస్ వ్యవస్థ ఏర్పాటైందని.. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఓ పోలీస్ స్టేషన్ మరో విభాగం చేతుల్లోకి వెళ్లడం జరగలేదని.. ఇది సిగ్గుచేటని ఓ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ట్వీట్ చేయడం గమనార్హం. తూత్తుకుడి జిల్లాలోని శాతంకులంలో పది రోజుల కిందట జయరాజ్, ఫీనిక్స్ అనే తండ్రీ కొడుకులు లాక్ డౌన్ టైంలో నిర్ణీత సమయాన్ని దాటి షాప్ తెరిచి ఉన్నారన్న కారణంతో పోలీసులు వారిని దండించడం.. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి వారిని పోలీసులు తీసుకెళ్లి చిత్రవధ చేసి ఇద్దరి మరణాలకు కారణం కావడం.. ఈ ఉదంతంపై పెద్ద దుమారం రేగడం తెలిసిన సంగతే.
This post was last modified on June 30, 2020 8:57 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…