మన ద్వారా ఆదాయం పొందుతూ.. ఆ ఆదాయాన్ని మన సైనికుల్ని దెబ్బ తీసేందుకు, మన ప్రత్యర్థులకు సాయపడేందుకు వినియోగిస్తున్న చైనాను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశానికి తోడు.. మన సమాచారం ఆ దేశానికి చేరకూడదన్న లక్ష్యంతో 59 ఆ దేశ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. మిగతా యాప్ల గురించి జనాలకు పెద్దగా పట్టింపు లేదు కానీ.. టిక్ టాక్ విషయంలో మాత్రం కోట్లాది మందిలో ఆందోళన నెలకొంది. రోజూ గంటలు గంటలు టిక్టాక్ చేస్తూ, చూస్తూ గడిపేవారికి ఇది మింగుడుపడని విషయమే. ఐతే బ్యాన్ అయితే చేశారు కానీ.. ఆల్రడీ మొబైళ్లలో ఉన్న యాప్ను ఏం చేయలేరనే ఆలోచనలోనే ఉన్నారు మెజారిటీ జనాలు.
నిన్న నిషేధం ప్రకటించాక మరుసటి రోజు కూడా టిక్ టాక్ యధావిధిగా వస్తుండటంతో దాని యూజర్లు ప్రశాంతంగానే ఉన్నారు. కొత్తగా యాప్ డౌన్ లోడ్ మాత్రమే ఉండదని అనుకున్నారు. కానీ సాయంత్రానికి వాళ్లందరికీ పెద్ద షాక్ తగిలింది. టిక్ టాక్ యాప్ ఆగిపోయింది. ఆ యాప్ ఓపెన్ చేయగానే నెట్ వర్క్ ఫెయిల్యూర్ అనే మెసేజ్ వస్తోంది. మొబైల్ నెట్ వర్క్ కంపెనీలే ఆ యాప్ పని చేయకుండా బ్రేక్ వేసేసినట్లు స్పష్టమవుతోంది. తాము ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పు చేసుకుని తిరిగి వస్తామంటూ టిక్టాక్ నుంచి కూడా ఓ మెసేజ్ డిస్ప్లే అవుతోంది కానీ.. అలాంటిదేమీ జరగదన్నది నిపుణుల మాట. టిక్ టాక్ చరిత్ర ముగిసిందని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. రిప్ టిక్ టాక్ అంటూ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ కూడా నడుస్తోంది. నిషేధించిన యాప్లు దేశానికి మంచివి కావని కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని.. ఆ యాప్ల ద్వారా చైనాకు డేటా వెళ్తోందనే పక్కా ఆధారాలు ఉండటంతోనే నిషేధానికి పూనుకుందని నిపుణులంటున్నారు. కాబట్టి టిక్టాక్కు ప్రత్యామ్నాయాలు చూసుకోక తప్పదన్నట్లే.
This post was last modified on June 30, 2020 8:45 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…