టిక్ టాక్.. భారతీయుల జన జీవనంలో భాగం అయిపోయిన యాప్ ఇది. మారుమూల ప్రాంతాల్లోని వాళ్లు కూడా సిగ్గు, బిడియం అన్నీ విడిచిపెట్టి తమ టాలెంట్ ప్రదర్శించేస్తున్నారు ఈ యాప్ ద్వారా. ఐతే ఈ యాప్లో మరీ శ్రుతి మించి పోయి ప్రవర్తించే వాళ్లూ లేకపోలేదు.
అలాంటి పోకడలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోవడం.. మన సంస్కృతికే అది ముప్పులా పరిణమించడం.. జనాల్లో ద్వేషం, సమాజంలో నేర ప్రవృత్తి పెరగడానికి ఈ యాప్ కారణమవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ‘టిక్ టాక్’ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు కూడా మొదలైపోయాయి. ఈ యాప్కు భారీగా రేటింగ్ పడిపోవడం కూడా తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం దేశంలో నిషేధించిన 59 యాప్ల జాబితాలో ‘టిక్ టాక్’ను కూడా చేర్చింది. ఇది చైనా యాప్ అన్న సంగతి తెలిసిందే.
ఐతే ఒకేసారి 59 యాప్లను ప్రభుత్వం నిషేధించినా.. అందరూ మాట్లాడుకుంటున్నది మాత్రం ‘టిక్ టాక్’ గురించే. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అత్యధికులు ఉపయోగిస్తున్న యాప్ల్లో ఇది ఒకటి. దీనికి కోట్ల మంది బానిసలుగా మారిపోయారు. టిక్ టాక్ పని చేయకపోతే, దాన్ని తప్పనిసరిగా డెలీట్ చేయాల్సి వస్తే.. వాళ్లలో ఎంతోమంది పిచ్చోళ్లయిపోతారు. అందుకే వాళ్లందరూ టిక్ టాక్ను బ్యాన్ చేయొద్దంటూ గగ్లోలు పెడుతున్నారు. ఐతే జనాలకు ఇలా ఓ బలహీనతగా మారిపోయిన ఈ యాప్ను నిషేధించి తీరాల్సిందే అన్నది మిగతా వర్గాల మాట.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘టిక్ టాక్’ బ్యాన్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిలా ఉంటే.. నిషేధిత యాప్ల జాబితాలో తమది కూడా ఉండటంతో టిక్ టాక్ యాజమాన్యం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల్ని అనుసరిస్తామని.. తమ దగ్గర డేటా చోర్యం ఎంతమాత్రం జరగదని.. తాము డేటాను చైనా సహా ఎవరితోనూ పంచుకోమని ఆ సంస్థ పేర్కొంది.
This post was last modified on July 1, 2020 8:50 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…