Political News

సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇంకో కరోనా పేషెంట్…

ఓవైపు తెలంగాణలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న ఆ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు లేవన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇన్ని కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం మొత్తానికి గాంధీ ఆసుపత్రి ఒక్కదాంట్లో మాత్రమే కోవిడ్ చికిత్స అందుతోంది.

గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు గురించి ప్రకటించారు కానీ.. అది అందుబాటులోకి రాలేదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షలకు లక్షలు బిల్లులు వాయించేస్తున్నారు. దీంతో మధ్యతరగతి, పేద రోగులు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఐతే గాంధీలోనే వసతులు అంతంతమాత్రం అని విమర్శలొస్తుంటే.. మిగతా ఆసుపత్రుల పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది.

కొన్ని రోజుల కిందటే కరోనాతో చనిపోయిన మనోజ్ అనే టీవీ జర్నలిస్టు.. గాంధీ ఆసుపత్రిలో వసతులు సరిగా లేవని.. తనను ఎవరూ పట్టించుకోలేదని చనిపోవడానికి ఒక్కరోజు ముందు వాట్సాప్ చాట్ చేసిన ఉదంతం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో రవికుమార్ అనే కోవిడ్ పేషెంట్ తనకు శ్వాస అందట్లేదని.. తాను వద్దంటున్నా వినకుండా వెంటిలేటర్ తీసేశారని ఆరోపిస్తూ చివరి క్షణాల్లో సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ తర్వాత తుది శ్వాస వదలడం కూడా కలకలకం రేపింది.

దీని తర్వాత అయినా పరిస్థితి మెరుగవుతుందనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. అదే చెస్ట్ హాస్పిటల్లో మరో వ్యక్తి వసతుల లేమి గురించి వీడియో ద్వారా వివరిస్తూ.. ఆ తర్వాత ప్రాణాలు వదిలాడు. తన చుట్టూ బెడ్స్ ఉండగా.. అందుబాటులో వైద్య సిబ్బంది ఒక్కరూ లేని వైనాన్ని ఆ పేషెంట్ వివరించాడు. ఈ వ్యక్తి కూడా తర్వాత పరిష్థితి విషమించి చనిపోయినట్లు వెల్లడైంది. దీనిపై పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతాలపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టకపోతే ఇలాంటి మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందేమో.

Satya

Recent Posts

పెద్ద‌ల స‌భ‌కు విజ‌య్‌.. మంచిదేనా.. ?

అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…

3 hours ago

హైదరాబాద్‌లో ఎకరం ఎంతంటే..

భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…

3 hours ago

చందమామ గ్లామర్ ఎటాక్.. పట్టించుకుంటారా?

టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…

4 hours ago

వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వం!

2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…

4 hours ago

మ‌రీ ఎక్కువ చెప్పినా క‌ష్ట‌మేమో పెద్దీ..

కొత్త సినిమాల‌కు ప్ర‌మోష‌న్ త‌గ్గినా క‌ష్ట‌మే. ప్రచారం మ‌రీ ఎక్కువైనా ప్ర‌మాద‌మే. వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌మోష‌న్లు చేసి జ‌నం దృష్టి…

6 hours ago

టీడీపీ ప్లాన్ సక్సెస్ అయితే రాజకీయాలు మారిపోతాయా?

టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…

6 hours ago