Political News

సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇంకో కరోనా పేషెంట్…

ఓవైపు తెలంగాణలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న ఆ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు లేవన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇన్ని కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం మొత్తానికి గాంధీ ఆసుపత్రి ఒక్కదాంట్లో మాత్రమే కోవిడ్ చికిత్స అందుతోంది.

గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు గురించి ప్రకటించారు కానీ.. అది అందుబాటులోకి రాలేదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షలకు లక్షలు బిల్లులు వాయించేస్తున్నారు. దీంతో మధ్యతరగతి, పేద రోగులు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఐతే గాంధీలోనే వసతులు అంతంతమాత్రం అని విమర్శలొస్తుంటే.. మిగతా ఆసుపత్రుల పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది.

కొన్ని రోజుల కిందటే కరోనాతో చనిపోయిన మనోజ్ అనే టీవీ జర్నలిస్టు.. గాంధీ ఆసుపత్రిలో వసతులు సరిగా లేవని.. తనను ఎవరూ పట్టించుకోలేదని చనిపోవడానికి ఒక్కరోజు ముందు వాట్సాప్ చాట్ చేసిన ఉదంతం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో రవికుమార్ అనే కోవిడ్ పేషెంట్ తనకు శ్వాస అందట్లేదని.. తాను వద్దంటున్నా వినకుండా వెంటిలేటర్ తీసేశారని ఆరోపిస్తూ చివరి క్షణాల్లో సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ తర్వాత తుది శ్వాస వదలడం కూడా కలకలకం రేపింది.

దీని తర్వాత అయినా పరిస్థితి మెరుగవుతుందనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. అదే చెస్ట్ హాస్పిటల్లో మరో వ్యక్తి వసతుల లేమి గురించి వీడియో ద్వారా వివరిస్తూ.. ఆ తర్వాత ప్రాణాలు వదిలాడు. తన చుట్టూ బెడ్స్ ఉండగా.. అందుబాటులో వైద్య సిబ్బంది ఒక్కరూ లేని వైనాన్ని ఆ పేషెంట్ వివరించాడు. ఈ వ్యక్తి కూడా తర్వాత పరిష్థితి విషమించి చనిపోయినట్లు వెల్లడైంది. దీనిపై పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతాలపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టకపోతే ఇలాంటి మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందేమో.

This post was last modified on June 30, 2020 11:07 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

7 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

8 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

9 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

10 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

10 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

11 hours ago