Political News

తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక లాక్ డౌన్ మోడల్ అవసరం

పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. పాత రూల్స్ ను మార్చి సరికొత్త నిబంధనల్ని తెర మీదకు తీసుకురావాల్సిన అవసరాన్ని యడ్డి సర్కారు గుర్తించింది. ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రంలో రాత్రి వేళలోనే కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా వచ్చే నెల 5 (జులై) నుంచి సరికొత్త లాక్ డౌన్ ను తెర మీదకు తీసుకురావాలని డిసైడ్ చేశారు.

అంతకంతకూ పెరుగుతున్నకేసుల నేపథ్యంలో.. ఆ జోరుకు కళ్లాలు వేసేలా కొత్త జాగ్రత్తలు తీసుకోవాలని నరి్ణయించారు. ఇందులో భాగంగా.. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. జులై 5 తర్వాత నుంచి వచ్చే ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అత్యవసరాలు తప్పించి.. మిగిలిన పనుల కోసం ప్రజలు బయటకు రాకూడదు. అదే సమయంలో శనివారాలు ఆఫీసులు బంద్ చేయాలని నిర్ణయించారు.

ప్రతి వారంలో ఐదురోజులు మాత్రమే పని దినాలు ఉండాలన్న నిర్ణయంతో పాటు.. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ విధించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక.. ఆదివారాల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నింటిని బంద్ చేయనున్నారు. క్యాబులు.. ఆటోలు.. ట్యాక్సీలు.. బస్సులతో పాటు ఎలాంటి వాహనాల్ని రోడ్ల మీదకు అనుమతించరు.

కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నట్లే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూఈ సరికొత్త లాక్ డౌన్ ను విధించాల్సిన అవసరం ఉంది. సెలవు రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా.. కమ్యునిటీ స్ప్రెడ్ కు అవకాశం లేకుండా చేస్తుందని చెప్పక తప్పదు. మరి.. కర్ణాటక మోడల్ ను రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎప్పటికి గుర్తిస్తారో..?

This post was last modified on June 28, 2020 10:21 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సాయిపల్లవిని టార్గెట్ చేసుకుంటున్నారు

నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…

2 mins ago

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…

43 mins ago

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

48 mins ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

4 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

4 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

5 hours ago