Political News

పీవీకి సత్య నాదెళ్లకు సంబంధం ఏంటి?

దేశం గర్వించదగ్గ ప్రధాన మంత్రుల్లో పీవీ నరసింహారావు ఒకరు. పైగా మన తెలుగు బిడ్డ. హైదరాబాదులో ఇంకా ఐటీ బూమ్ కూడా రాకముందే 2004లో చనిపోయారు. ఇక సత్య నాదెళ్ల ఇటీవలే వెలుగులోకి వచ్చారు. మన తెలుగువాడే అయినా ఎపుడో విదేశాలకు వెళ్లిపోయారు. అసలు వీరిద్దరు కలిసే అవకాశం ఏ కోశానా లేదే అనుకుంటున్నారా… బహుశా మనం ప్రస్తావించుకునే సంఘటన సత్యనాదెళ్లకు కూడా గుర్తుండుకపోవచ్చు. అలాంటి సంఘటన ఇది.

వేణుగోపాల్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయన కూతురు అనుపమను సత్యనాదెళ్ల పెళ్లాడారు. వేణుగోపాల్ 1967లో రాజమండ్రి సబ్ కలెక్టరుగా ఉండేవారు. అప్పట్లో పీవీ మంత్రిగా పనిచేసేవారు. పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన పీవీకి వేణుగోపాల్ పనితీరు నచ్చి గుర్తుపెట్టుకున్నారు. ఆయన కూడా పీవీ గారిని ఎంతో ఇష్టపడ్డారు. అనుకోకుండా పీవీ సొంత జిల్లా వరంగల్ కు కలెక్టరయ్యారు వేణుగోపాల్. అపుడు కరీంనగర్ జిల్లా వంగరలో పీవీ నివాసం ఉండేది. ఆ క్రమంలో పీవీకి మరింత దగ్గరయ్యారు. 1970-71 మధ్య అక్కడ పనిచేశారు. 71లో పీవీ ముఖ్యమంత్రి అయ్యాక వేణుగోపాల్ ను సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరుగా స్వయంగా ఎంచుకున్నారట. పేదల జీవితాలకు చాలా దగ్గరగా ఉండే శాఖ అది. అందుకే పనితీరులో తనకు ఇష్టుడైన వేణుగోపాల్ ను దాని డైరెక్టరుగా నియమించి పలు సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యాక కూడా వేణుగోపాల్ ను తన వెంట తీసుకెళ్లారు.

వేణుగోపాల్ తన కూతురు అనుపమకు సత్య నాదెళ్లతో వివాహం నిశ్చయించారు. 1992లో వారి నిశ్చితార్థం, పెళ్లి జరిగాయి. పెద్దలను పెళ్లికి పిలుద్దాం అని బంధువులను, క్లోజ్ సర్కిల్ ని నిశ్చితార్థానికి ఆహ్వానించారట ఐఏఎస్ వేణుగోపాల్. అప్పట్లో పీవీ పేషీలోనే పనిచేస్తుండటంతో ఢిల్లీలోనే ఉండేవారు. శుభకార్యం కూడా ఢిల్లీలోనే జరిగింది. అయితే, ఈ నిశ్చితార్థానికి అనుకోని అతిథిగా వచ్చారు పీవీ నరసింహారావు. వేణుగోపాల్ కు ఫీజులెగిరిపోయాయి. ఎందుకంటే పీవీ గారికి ఆహ్వానం పంపలేదు. తనకు ప్రియమైన అధికారి ఇంట శుభకార్యం కదా అని వీలుచేసుకుని పీవీ హాజరయ్యారట. ఒక ప్రధాని అయి ఉండి పిలవకపోయినా నా కూతురు నిశ్చితార్థానికి హాజరై ఆశీర్వదించడం ఆయన నిలువెత్తు నిరాడంబరతకు, అధికార వర్గాలకు ఆయన ఇచ్చే మర్యాదకు మచ్చు తునక అని వేణుగోపాల్ జ్జాపకాలు నెమరేసుకున్నారు. తర్వాత పెళ్లికి ఎలాగూ హాజరయ్యారు. అది వేరే విషయం. అప్పటికి సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ కూడా ఐఏఎస్ అధికారే. అలా సత్య నాదెళ్లను పీవీ నరసింహారావు గారు రెండు సార్లు ఆశీర్వదించారు.

సత్య నాదెళ్లకు ఈ విషయం గుర్తుండొచ్చు. కానీ కీలక బాధ్యతల్లో ఉన్న ఆయనకు ఈరోజు పీవీ శతజయంతి ఉత్సవం అని తెలిసి ఉండే అవకాశం తక్కువ. బహుశా అందుకే ఆయన గురించి ట్వీట్ చేసి ఉండకపోవచ్చు. తన పెళ్లికి వచ్చిన ప్రధాని గురించి ఆయన మరిచిపోయే అవకాశం తక్కువ.

This post was last modified on June 28, 2020 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

3 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

4 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

4 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

6 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

6 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

7 hours ago