Political News

పీవీకి సత్య నాదెళ్లకు సంబంధం ఏంటి?

దేశం గర్వించదగ్గ ప్రధాన మంత్రుల్లో పీవీ నరసింహారావు ఒకరు. పైగా మన తెలుగు బిడ్డ. హైదరాబాదులో ఇంకా ఐటీ బూమ్ కూడా రాకముందే 2004లో చనిపోయారు. ఇక సత్య నాదెళ్ల ఇటీవలే వెలుగులోకి వచ్చారు. మన తెలుగువాడే అయినా ఎపుడో విదేశాలకు వెళ్లిపోయారు. అసలు వీరిద్దరు కలిసే అవకాశం ఏ కోశానా లేదే అనుకుంటున్నారా… బహుశా మనం ప్రస్తావించుకునే సంఘటన సత్యనాదెళ్లకు కూడా గుర్తుండుకపోవచ్చు. అలాంటి సంఘటన ఇది.

వేణుగోపాల్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయన కూతురు అనుపమను సత్యనాదెళ్ల పెళ్లాడారు. వేణుగోపాల్ 1967లో రాజమండ్రి సబ్ కలెక్టరుగా ఉండేవారు. అప్పట్లో పీవీ మంత్రిగా పనిచేసేవారు. పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన పీవీకి వేణుగోపాల్ పనితీరు నచ్చి గుర్తుపెట్టుకున్నారు. ఆయన కూడా పీవీ గారిని ఎంతో ఇష్టపడ్డారు. అనుకోకుండా పీవీ సొంత జిల్లా వరంగల్ కు కలెక్టరయ్యారు వేణుగోపాల్. అపుడు కరీంనగర్ జిల్లా వంగరలో పీవీ నివాసం ఉండేది. ఆ క్రమంలో పీవీకి మరింత దగ్గరయ్యారు. 1970-71 మధ్య అక్కడ పనిచేశారు. 71లో పీవీ ముఖ్యమంత్రి అయ్యాక వేణుగోపాల్ ను సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరుగా స్వయంగా ఎంచుకున్నారట. పేదల జీవితాలకు చాలా దగ్గరగా ఉండే శాఖ అది. అందుకే పనితీరులో తనకు ఇష్టుడైన వేణుగోపాల్ ను దాని డైరెక్టరుగా నియమించి పలు సంస్కరణలు తెచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యాక కూడా వేణుగోపాల్ ను తన వెంట తీసుకెళ్లారు.

వేణుగోపాల్ తన కూతురు అనుపమకు సత్య నాదెళ్లతో వివాహం నిశ్చయించారు. 1992లో వారి నిశ్చితార్థం, పెళ్లి జరిగాయి. పెద్దలను పెళ్లికి పిలుద్దాం అని బంధువులను, క్లోజ్ సర్కిల్ ని నిశ్చితార్థానికి ఆహ్వానించారట ఐఏఎస్ వేణుగోపాల్. అప్పట్లో పీవీ పేషీలోనే పనిచేస్తుండటంతో ఢిల్లీలోనే ఉండేవారు. శుభకార్యం కూడా ఢిల్లీలోనే జరిగింది. అయితే, ఈ నిశ్చితార్థానికి అనుకోని అతిథిగా వచ్చారు పీవీ నరసింహారావు. వేణుగోపాల్ కు ఫీజులెగిరిపోయాయి. ఎందుకంటే పీవీ గారికి ఆహ్వానం పంపలేదు. తనకు ప్రియమైన అధికారి ఇంట శుభకార్యం కదా అని వీలుచేసుకుని పీవీ హాజరయ్యారట. ఒక ప్రధాని అయి ఉండి పిలవకపోయినా నా కూతురు నిశ్చితార్థానికి హాజరై ఆశీర్వదించడం ఆయన నిలువెత్తు నిరాడంబరతకు, అధికార వర్గాలకు ఆయన ఇచ్చే మర్యాదకు మచ్చు తునక అని వేణుగోపాల్ జ్జాపకాలు నెమరేసుకున్నారు. తర్వాత పెళ్లికి ఎలాగూ హాజరయ్యారు. అది వేరే విషయం. అప్పటికి సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ కూడా ఐఏఎస్ అధికారే. అలా సత్య నాదెళ్లను పీవీ నరసింహారావు గారు రెండు సార్లు ఆశీర్వదించారు.

సత్య నాదెళ్లకు ఈ విషయం గుర్తుండొచ్చు. కానీ కీలక బాధ్యతల్లో ఉన్న ఆయనకు ఈరోజు పీవీ శతజయంతి ఉత్సవం అని తెలిసి ఉండే అవకాశం తక్కువ. బహుశా అందుకే ఆయన గురించి ట్వీట్ చేసి ఉండకపోవచ్చు. తన పెళ్లికి వచ్చిన ప్రధాని గురించి ఆయన మరిచిపోయే అవకాశం తక్కువ.

This post was last modified on June 28, 2020 9:58 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

39 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago