Political News

అటువైపు నుంచి న‌రుక్కొస్తున్న రాజు గారు

త‌న కామెంట్లు, చ‌ర్య‌ల‌తో వైసీపీలో అగ్గి రాజేసి, అనంత‌రం ఆ పార్టీ పెద్ద‌ల నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంకా ఆ దూకుడును కొన‌సాగిస్తున్నారు.

పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆయన తక్షణమే స్పందించడంతో పాటుగా వారం రోజులు గడువు ఇచ్చినా నోటీసు అందిన మర్నాడే సంజాయిషీ పంపించారు. పార్టీ పేరుపైనే అభ్యంతరం చెప్తూ నోటీస్‌కు రఘురామకృష్ణంరాజు సమాధానం ఇచ్చారు. దానికి కొన‌సాగింపుగా ఆయ‌న తాజాగా ఢిల్లీ చేరుకున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌న్నిహితుడు అయిన‌ ఎంపీ విజయసాయి రెడ్డి తనకు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చినందున ఆయ‌న‌ హోదాతో పాటు వైసీపీ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటు రిప్లై ఇచ్చారు. పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్సా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయా? అని ప్రశ్నించారు. జాతీయ ప్రధానకార్యదర్శిగా పేర్కొంటూ విజయసాయిరెడ్డి నోటీసు ఇవ్వడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉన్న దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ విజయసాయిరెడ్డికి సూటిగా ప్రశ్నించారు. తమది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అనే పార్టీ వేరే వాళ్లదని, వైఎస్‌ఆర్‌ అనే పేరు ఉపయోగించవద్దని గతంలోనే ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసిందని లేఖలో పేర్కొన్నారు.

అసలు పార్టీలో ఈసీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణా కమిటీనే లేదన్నారు. అలాంటిది విజయసాయిరెడ్డి తనకు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడం చట్టవిరుద్ధమంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈసీకీ ఫిర్యాదు చేశారు.

ఇలా లేఖ‌, మీడియాలో మాట్లాడుతూ అనేక అంశాల‌ను ప్ర‌స్తావించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు హ‌ఠాత్తుగా ఢిల్లీకి చేర‌డం స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌ను ప్ర‌స్తావించిన అంశాలన్నింటిని వివరించేందుకు ఆయ‌న‌ ఈసీని కలవనున్నారని స‌మాచారం. దీంతోపాటుగా బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పాలన స‌హా వివిధ విధానాలు, నిర్ణ‌యాల‌ను రఘురామకృష్ణంరాజు వివరించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఓ వైపు వైసీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయ‌న్ను దారిలోకి తెచ్చుకోవాల‌ని చూస్తుంటే ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం మ‌రింత దూకుడ‌గా ముందుకు వెళ్తుండ‌టం స‌హ‌జంగానే వైసీపీకి ఇర‌కాటంగా మారింది.

This post was last modified on June 28, 2020 9:27 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago