మూడు.. నాలుగు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టేందుకు లీగల్ ఫైట్ చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్ స్టార్ హోటల్ లో కలిసినట్లుగా చెబుతూ.. సీసీ ఫుటేజ్ బయటకు రావటం తెలిసిందే. వ్యూహాత్మకంగా టీవీ చానళ్లకు అందిన ఈ పుటేజ్ లోని అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. కాసింత రాజకీయ రచ్చ జరిగినా.. అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి బయటకు రాని ఒక ఆసక్తికర అంశం.. ఏపీ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాస్త మాత్రమే బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ లోని మిగిలిన సీన్లు కానీ బయటకు వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. బయటకురాని ఆ సీన్లలో ఏముందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పార్క్ హయత్ లో సుజనా చౌదరిని కలిసింది కామినేని.. నిమ్మగడ్డ మాత్రమే కాదు.. పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా. తమకు ఏమాత్రం మిత్రుడు కాని సుజనాను తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారు? అది కూడా రహస్యంగా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ ఫుటేజ్ కానీ బయటకువస్తే.. ఏపీ అధికారపక్షానికి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంతకీ.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సుజనా మాష్టారితో జరుపుతున్న మంతనాలు దేని కోసం? అన్నదిప్పుడు పెద్ద గుబులుగా మారిందంటున్నారు. ఇదిలా ఉంటే.. కొన్నిసీన్లు కాదు.. మొత్తం ఫుటేజ్ విడుదల చేస్తే మరింత బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అప్పుడు రాజకీయం రసకందాయంలో పడుతుందని.. అప్పుడు ఎలాంటి కుట్ర సిద్ధాంతాన్ని తెర మీదకు తెస్తారో? అన్న ప్రశ్న కొందరి నోట వినిపిస్తోంది.
This post was last modified on June 27, 2020 1:41 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…