Political News

టీడీపీ నేత‌ల‌తో న‌డ్డా ర‌హ‌స్య భేటీ..?

ఏపీలో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా.. పార్టీ గురించి పెద్ద ఎత్తున ఆశా భావం వ్య‌క్తం చేశారు. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతి పెరిగిపోయింద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న పొత్తుల విష‌యంలో ఎక్క‌డా ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. అదేస‌మ‌యంలో త‌మ‌తో పొత్తులోనే ఉన్న జ‌న‌సేన పార్టీ విష‌యంలోనూ ఎక్క‌డా ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యంలోనూ న‌డ్డా బ‌హిరంగ వేదిక‌ల‌పై ఎక్క‌డా ప్ర‌స్తావ‌న చేయ‌లేదు. కానీ, ఇదే స‌మ‌యంలో అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. న‌డ్డాతో టీడీపీకి చెందిన కీల‌క నాయ కులు భేటీ అయిన‌ట్టు స‌మాచారం. వీరిలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన‌.. ప‌లువురు కీల‌క నాయ‌కులు ఉన్న‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి, ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్న విశాఖ ఫైర్ బ్రాండ్ ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ స‌మావేశంలో ఏం చ‌ర్చించార‌నేది ఆస‌క్తిగా మారింది.

విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో న‌డ్డాతో వీరంతా భేటీ అయి దాదాపు గంట‌కు పైగానే చ‌ర్చించార‌ని తెలిసింది. ఈ చ‌ర్చ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యంపైనే వారు స‌మాలోచ‌న‌లు జ‌రిపార‌ని తెలిసింది. నిజానికి టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంద‌నే సంకేతాలు కొన్నాళ్లుగా వ‌స్తూనే ఉన్నాయి. ఈ విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌ని చెబుతున్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తుల విష‌యంలో టీడీపీని క‌లుపుకొని వెళ్తామ‌ని.. ఎక్క‌డా బీజేపీ ప్ర‌క‌టించ లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌డ్డాతో జ‌రిగిన భేటీ అత్యంత ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు ఆర్ ఎస్ ఎస్ నుంచి కూడా టీడీపీని క‌లుపుకొని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే సూచ‌న‌లు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన బీజేపీ సింహ గ‌ర్జ‌న స‌భ‌లో న‌డ్డా మాట్లాడుతూ.. టీడీపీని విమ‌ర్శించ‌క‌పోవ‌డం.. పైగా బ‌స్సు మిస్స‌యింద‌నే వ్యాఖ్య‌లు చేయ‌డం.. వంటివి రాబోయే రోజుల్లో టీడీపీతో బీజేపీ క‌లిసి ప‌నిచేస్తుంద‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 8, 2022 10:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

2 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

2 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

3 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

3 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

5 hours ago

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

7 hours ago