Political News

రాష్ట్రంలో మంత్రులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారు

తెలంగాణ రాష్ట్రంలో నేత‌ల ప‌రంగా, ఎమ్మెల్యేల సంఖ్య ప‌రంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్ప‌టికీ గ‌త కొద్దికాలంగా ముఖ్య‌మైన అంశాల విష‌యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ స్పందిస్తోంద‌నేది విశ్లేష‌కుల కామెంట్‌. క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న స‌మ‌యంలో అయితే, ఈ రెండు పార్టీల మ‌ద్య మాట‌ల యుద్ధం మ‌రింత పెరిగింది. తాజాగా, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేశారు. తెలంగాణ మంత్రుల ప‌రువు తీసేసేలా…మంత్రులు పొలాల్లో దిష్టిబొమ్మల్లా తయారయ్యారని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్ల‌మెంటు ప‌రిధిలోకి వ‌చ్చే వేములవాడలో పట్టణంలోని 16, 26 వార్డులలో ప‌ర్య‌టించి సీసీ రోడ్, డ్రైనేజీల కోసం భూమి పూజ చేసిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రంలో మంత్రులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారని.. అప్పుడప్పుడు పక్షులు వాలిన సమయంలో దిష్టిబొమ్మలు కదిలినట్లు కదులుతుంటారని ఎద్దేవా చేశారు. రోడ్లను శాంక్షన్ చేయని రోడ్ల శాఖ మంత్రి.. పైసా ఇవ్వని పైనాన్స్ మంత్రి.. కనీసం హోమ్ గార్డ్ ను కూడా ట్రాన్స్ పర్ చేయలేని హోం మంత్రి.. కనీసం ఒక్క బస్ ను శాంక్షన్ చేయని మంత్రులు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం అడిగితే.. పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తద్వారా, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు నుంచి మొద‌లుకొని హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ వ‌ర‌కూ అంతా కేసీఆర్ ముందు ఒక‌టేన‌ని ప‌రోక్షంగా చెప్పేశారు.

కరోనా విషయంలో రాష్ట్ర స్థాయిలో బులెటిన్‌కి, జిల్లా అధికారులు చెబుతున్న దానికి పొంతన కనిపించడం లేదని పాజిటివ్ కేసుల సంఖ్యలో చాలా తేడాలున్నాయని బండి సంజ‌య్ అన్నారు. కరోనా ప‌రీక్ష‌లు కూడా సరిగా చేయడం లేదు…బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో 5 లక్షల టెస్టులు, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లో 3 లక్షల టెస్ట్ లు చేశారు.

కరోనా ప్రభావం మొదలయ్యాక కేంద్రం 20 లక్షల కోట్లు కేటాయిస్తే…దాన్ని కూడా సీఎం కేసీఆర్ తప్పు పడుతున్నారని మండిప‌డ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్క దారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి కాబట్టి.. సీఎం జీర్ణించుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కాపాడే పరిస్థితిలో లేడని, ఇప్పటికే చేతులు ఎత్తేశారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని.. పేద ప్రజలను పట్టించుకోవాలని సూచించారు.

This post was last modified on June 26, 2020 2:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

14 minutes ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

1 hour ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

3 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

4 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

5 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

6 hours ago