Political News

రాష్ట్రంలో మంత్రులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారు

తెలంగాణ రాష్ట్రంలో నేత‌ల ప‌రంగా, ఎమ్మెల్యేల సంఖ్య ప‌రంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్ప‌టికీ గ‌త కొద్దికాలంగా ముఖ్య‌మైన అంశాల విష‌యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ స్పందిస్తోంద‌నేది విశ్లేష‌కుల కామెంట్‌. క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న స‌మ‌యంలో అయితే, ఈ రెండు పార్టీల మ‌ద్య మాట‌ల యుద్ధం మ‌రింత పెరిగింది. తాజాగా, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేశారు. తెలంగాణ మంత్రుల ప‌రువు తీసేసేలా…మంత్రులు పొలాల్లో దిష్టిబొమ్మల్లా తయారయ్యారని ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్ల‌మెంటు ప‌రిధిలోకి వ‌చ్చే వేములవాడలో పట్టణంలోని 16, 26 వార్డులలో ప‌ర్య‌టించి సీసీ రోడ్, డ్రైనేజీల కోసం భూమి పూజ చేసిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రంలో మంత్రులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారని.. అప్పుడప్పుడు పక్షులు వాలిన సమయంలో దిష్టిబొమ్మలు కదిలినట్లు కదులుతుంటారని ఎద్దేవా చేశారు. రోడ్లను శాంక్షన్ చేయని రోడ్ల శాఖ మంత్రి.. పైసా ఇవ్వని పైనాన్స్ మంత్రి.. కనీసం హోమ్ గార్డ్ ను కూడా ట్రాన్స్ పర్ చేయలేని హోం మంత్రి.. కనీసం ఒక్క బస్ ను శాంక్షన్ చేయని మంత్రులు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం అడిగితే.. పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తద్వారా, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు నుంచి మొద‌లుకొని హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ వ‌ర‌కూ అంతా కేసీఆర్ ముందు ఒక‌టేన‌ని ప‌రోక్షంగా చెప్పేశారు.

కరోనా విషయంలో రాష్ట్ర స్థాయిలో బులెటిన్‌కి, జిల్లా అధికారులు చెబుతున్న దానికి పొంతన కనిపించడం లేదని పాజిటివ్ కేసుల సంఖ్యలో చాలా తేడాలున్నాయని బండి సంజ‌య్ అన్నారు. కరోనా ప‌రీక్ష‌లు కూడా సరిగా చేయడం లేదు…బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో 5 లక్షల టెస్టులు, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లో 3 లక్షల టెస్ట్ లు చేశారు.

కరోనా ప్రభావం మొదలయ్యాక కేంద్రం 20 లక్షల కోట్లు కేటాయిస్తే…దాన్ని కూడా సీఎం కేసీఆర్ తప్పు పడుతున్నారని మండిప‌డ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్క దారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి కాబట్టి.. సీఎం జీర్ణించుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కాపాడే పరిస్థితిలో లేడని, ఇప్పటికే చేతులు ఎత్తేశారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని.. పేద ప్రజలను పట్టించుకోవాలని సూచించారు.

This post was last modified on June 26, 2020 2:05 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అవినాష్‌రెడ్డి పాస్ పోర్టు రెడీ చేసుకున్నారు: ష‌ర్మిల‌

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నార‌ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల…

1 hour ago

ప్రతినిధి-2.. టార్గెట్ జగనేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముంగిట రాజకీయ నేపథ్యం ఉన్న పలు చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,…

2 hours ago

దేవర ముందు జాగ్రత్త మంచిదే

జూనియర్ ఎన్టీఆర్ దేవర అధికారిక విడుదల తేదీ అక్టోబర్ 10లో ఎలాంటి మార్పు లేదు కానీ అంతర్గతంగా జరుగుతున్న కొన్ని…

3 hours ago

ఓటింగ్ శాతం పెరుగుదల వెనక మర్మమేంటి ?

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదా ? తొలి, మలి దశ ఎన్నికలలో ఆ పార్టీకి ఎదురుగాలి…

4 hours ago

మైనస్ వంద గురించి బన్నీ నిజాయితీ

మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ…

4 hours ago

వారసుడి కోసం బ్రహ్మానందం తాత వేషం

https://www.youtube.com/watch?v=kR4Y4m3FyhU&t=225s హాస్యానికి మారుపేరుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే మీమ్ గాడ్ గా చెప్పుకునే బ్రహ్మానందంకు నట వారసత్వం రూపంలో రాజా…

5 hours ago