Political News

బిన్ లాడెన్ ని అమరవీరుడని కీర్తించిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ తన అసలు రూపం బయటపెట్టుకుంది. టెర్రరిస్టు దేశం అనే ఆరోపణలను నిజం చేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడిగా కీర్తించింది. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. అంటే వాళ్లంతట వారే ప్రపంచ ఉగ్రవాదిని అమరవీరుడు అనడం అంటే ఉగ్రవాదలకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించడమే అని అర్థం.

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాపై కూడా ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలతో మా దేశంలోకి ప్రవేశించి ఒసామా బిన్ లాడెన్ చంపింది. మమ్మల్ని అణిచివేసింది, అవమానించింది అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరు పేరిట అమెరికా పది సంవత్సరాలు మమ్మల్ని దారుణంగా ఇబ్బంది పెట్టిందని ఆయన పేర్కొనడం గమనార్హం. లాడెన్ ను చంపినపుడు మేము తీవ్రంగా మదనపడ్డాం, ఆవేదన చెందాం అన్నారు ఇమ్రాన్. తాజాగా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఇంకా స్పందించలేదు.

ప్రపంచం ఎన్నటికీ మరిచిపోలేని దారుణ మారణహోమం అయిన 9/11 కు కారణమైన ప్రపంచ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అధినాయకుడు ఒసామాబిన్ లాడెన్. అల్ ఖైదా ఉగ్రవాదాలు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను 2001 సెప్టెంబరు 9న కూల్చివేశారు. ఈ ఘోర ప్రమాదానికి ప్రపంచం వణికి పోయింది. అమెరికా అల్లాడిపోయింది. ఈ దుర్ఘటనలో 3 వేల మంది చనిపోగా 25 వేల మంది గాయపడ్డారు. అంతేకాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడిగా కూడా పరిగణించారు. ఆరోజే అమెరికా అల్ ఖైదాను అంత చేయడానికి శపథం చేసింది.

ఇదిలా ఉండగా… గతంలో ఎన్నికల ముందు లాడెన్ ను టెర్రరిస్ట్ అనడానికి ఇమ్రాన్ ఖాన్ సంశయించారు. కానీ అతను ఒక వీరుడు అని కీర్తించడం మాత్రం ఇదే తొలిసారి. చైనా ఇండియా సరిహద్దుల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో పాకిస్తాన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక చైనా అండ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, భారత్ – చైనా పోరులో భారత్ కు అమెరికా మద్దతు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ వ్యాఖ్యలు కీలక పరిణామం.

This post was last modified on June 25, 2020 7:16 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

38 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

49 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

2 hours ago