Political News

ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా పోరాటం

ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని తొలిసారి.. తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌కు చెందిన‌ పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని.. తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామనాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించి ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.

ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఆదేశాల మేరకే ఇప్పటికీ ఆయన అభిమానులు పని చేస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అవ్వాల్సింది.. జస్ట్‌లో మిస్ అయింది. అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తారాస్థాయిలో అభిమానులున్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్’ అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు.

ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకు అన్ని రకాల సంక్షేమం చేరుకోవాలని ఆకాంక్షించారు. తన వద్ద అర్ధరూపాయి కూడా లేకున్నా.. తనని మంత్రి చేసి.. తనకు పెళ్లి చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆయనే కారణమని తెలిపారు. ఆయన తన అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడు బతికే ఉంటారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అన్న పరిటాల సునీత.. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడు అని కీర్తించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు.. ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కల్పించారని కొనియాడారు. కేసీఆర్, జగన్‌లు ప్రతిపక్ష పార్టీలను ఎదగనీయడం లేదని విమర్శించారు. ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం టీడీపీ పని చేస్తుందని తెలిపారు.

This post was last modified on May 28, 2022 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటీటీల కొత్త కండిషన్… పెద్ద తలనొప్పే

ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…

6 minutes ago

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై…

2 hours ago

బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా?

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…

2 hours ago

కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…

3 hours ago

శ్రీవిష్ణు అస్సలు తగ్గడం లేదు

ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…

5 hours ago

వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌..…

5 hours ago