Political News

ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా పోరాటం

ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని తొలిసారి.. తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌కు చెందిన‌ పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని.. తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామనాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించి ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.

ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఆదేశాల మేరకే ఇప్పటికీ ఆయన అభిమానులు పని చేస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అవ్వాల్సింది.. జస్ట్‌లో మిస్ అయింది. అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తారాస్థాయిలో అభిమానులున్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్’ అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు.

ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకు అన్ని రకాల సంక్షేమం చేరుకోవాలని ఆకాంక్షించారు. తన వద్ద అర్ధరూపాయి కూడా లేకున్నా.. తనని మంత్రి చేసి.. తనకు పెళ్లి చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆయనే కారణమని తెలిపారు. ఆయన తన అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడు బతికే ఉంటారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అన్న పరిటాల సునీత.. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడు అని కీర్తించారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు.. ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కల్పించారని కొనియాడారు. కేసీఆర్, జగన్‌లు ప్రతిపక్ష పార్టీలను ఎదగనీయడం లేదని విమర్శించారు. ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం టీడీపీ పని చేస్తుందని తెలిపారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago