Political News

హైద‌రాబాద్ వాసుల‌కు అదిరిపోయే షాకిచ్చిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో హైద‌రాబాద్ వాసుల్లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. క‌రోనా క‌ల‌క‌లంపై ఆదిలో తీపిక‌బురు ఇచ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు తాజాగా షాక్ ఇచ్చినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న స‌మ‌యంలో… కేసుల తీవ్ర‌త ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి 50 వేల టెస్ట్‌లు చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ తాజాగా ఈ టెస్టుల‌కు బ్రేక్ ప‌డింది. తెలంగాణ‌ రాష్ట్రంలో టెస్ట్‌లు పెర‌గ‌డంతో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న త‌రుణంలో హైద‌రాబాద్ ప‌రిధిలో టెస్టులు నిలిపివేశారు.

తెలంగాణ‌లో రోజుకో కొత్త రికార్డు త‌ర‌హాలో పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి పోతూనే ఉంది. ఇటీవ‌లే కరోనా పరీక్షల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారిగా కరోనా కేసులు వెల్లడించాల‌ని జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరాలు కాలనీ సంఘాలకు ఇవ్వాల‌ని ఆదేశించింది.

ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింద‌ని గుర్తుచేసిన‌ హైకోర్టు.. ఐసీఎంఆర్‌ సూచనలను పరిగణలోకి తీసుకోవాల‌ని పేర్కొంది. అనంత‌రం ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సూచించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప‌రిధి ఆ ప‌క్క‌నే ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ టెస్ట్‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ ప్ర‌క్రియ‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.

ఇప్పటికే సేకరించిన శాంపిల్స్‌కు సంబంధించిన టెస్టింగ్ ప్ర‌క్రియ పూర్తికాక‌పోవ‌డంతో ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు టెస్ట్‌ల‌ను అధికారులు నిలిపివేశారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే తెలంగాణ క‌రోనా టెస్ట్‌ల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంద‌నే విమ‌ర్శ‌లు బీజేపీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా, బుధ‌వారం నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలు దాటాయి. బుధ‌వారం ఒక్క‌రోజే 891 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటిలో 719 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా హైద‌రాబాద్ ప‌రిస‌ర జిల్లాలైన‌ రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 55 కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 10444కి చేరగా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361కి చేరింది.

This post was last modified on June 25, 2020 3:43 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

34 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago