తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ వాసుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా కలకలంపై ఆదిలో తీపికబురు ఇచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో… కేసుల తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవడానికి 50 వేల టెస్ట్లు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తాజాగా ఈ టెస్టులకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రంలో టెస్ట్లు పెరగడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ పరిధిలో టెస్టులు నిలిపివేశారు.
తెలంగాణలో రోజుకో కొత్త రికార్డు తరహాలో పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి పోతూనే ఉంది. ఇటీవలే కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారిగా కరోనా కేసులు వెల్లడించాలని జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల వివరాలు కాలనీ సంఘాలకు ఇవ్వాలని ఆదేశించింది.
ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించిందని గుర్తుచేసిన హైకోర్టు.. ఐసీఎంఆర్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. అనంతరం ప్రభుత్వం ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధి ఆ పక్కనే ఉన్న నియోజకవర్గాల్లో ఈ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇప్పటికే సేకరించిన శాంపిల్స్కు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఇవాళ, రేపు.. రెండు రోజుల పాటు టెస్ట్లను అధికారులు నిలిపివేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కరోనా టెస్ట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందనే విమర్శలు బీజేపీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, బుధవారం నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలు దాటాయి. బుధవారం ఒక్కరోజే 891 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటిలో 719 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డిలో 86, మేడ్చల్లో 55 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 10444కి చేరగా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361కి చేరింది.
This post was last modified on June 25, 2020 3:43 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…