Political News

‘కోనసీమ’ లో రాజకీయ మంటలు: అమలాపురం తగలబడింది

ఏపీ అట్టుడుకుతోంది. రాష్ట్రం ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

‘కోనసీమ ముద్దు – వేరే పేరు వద్దు’ అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అన్ని వైపుల నుంచి పట్టణంలోకి చొచ్చుకొచ్చారు. బస్టాండ్‌తో పాటు ముమ్మిడివరం వైపు నుంచి గడియారం స్తంభం వద్దకు ప్రదర్శనగా చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించారు. అయినా నిరసనకారులు వెనకడుగు వెయ్యలేదు. సమయం గడిచేకొద్దీ వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా ఎస్పీ.. రోడ్లపైకి వచ్చిన నిరసనకారుల్ని వాహనాల్లో తరలించేందుకు యత్నించగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొందరు యువకులను అరెస్టు చేసి బస్సుల్లో తరలిస్తుండగా.. బస్సును వెంబడించి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో నల్లవంతెన వద్ద ఆందోళనకారులపై లాఠీలు ఝళిపించారు. దీంతో రెచ్చిపోయిన యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు.

రాళ్లదాడిలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఘటనలో పలువురు పోలీసులతో పాటు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. రెచ్చిపోయిన ఆందోళన కారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. మరో బస్సు అద్దాలు ధ్వసం చేశారు.

పూర్తిగా త‌గ‌ల‌బ‌డిన మంత్రి ఇల్లు

అనంతరం అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటికి వేలాదిగా తరలివచ్చిన నిరసన కారులు ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఇంటి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి ఇంటి వద్ద ఉన్న పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం, ఓ ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు. అనంతరం మంత్రి ఇంటికి కూడా నిప్పుపెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మంత్రి విశ్వరూప్‌ సతీమణి, పిల్లలను కారులో వేరే ప్రాంతానికి తరలించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి కూడా ఆందోళన కారులు నిప్పు పెట్టారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యంమే: జ‌న‌సేన

అమలాపురం ఘటనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని.. శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అంబేడ్కర్ పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను పవన్కల్యాణ్ ఖండించారు. అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పాలనా లోపాలను కప్పిపుచ్చు కోవడానికి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావనను ఖండించారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ ప్ర‌భుత్వం వైఫల్యాలను జనసేనపై రుద్దకూడదని పవన్ హెచ్చరించారు.

This post was last modified on May 24, 2022 8:40 pm

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

2 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

2 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

2 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

3 hours ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

3 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

4 hours ago