Political News

కరోనా బారినపడి మరో ఎమ్మెల్యే మృతి

కరోనాకు కనికరం లేదు….జాలి దయ అంతకన్నా లేదు…అందుకే కటిక పేదవాడి నుంచి కరోడ్ పతి వరకు ఎవరిపైనా వివక్ష చూపకుండా కాటేస్తోంది. రాజకీయ నేతలను…సామాన్యులను ….ఇలా తన బారినపడ్డవారిని కబళిస్తూ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా చాలామంది ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.

కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే అనబళగన్ కరోనా బారినపడి మరణించారు. ఇపుడు తాజాగా పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60)ను మహమ్మారి వైరస్ కబళించింది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన రెండో ఎమ్మెల్యే ఘోష్. తన పార్టీకి చెందిన సీనియర్ నేత ఘోష్ అకాల మరణంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.

గత నెలలో ఘోష్ కు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఘోష్ కు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో కోలుకోలేకపోయారు. ఘోష్ హఠాన్మరణం చాలా దురదృష్టకరమని, తమ పార్టీ ఓ మంచి నేతను కోల్పోయిందని దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫాల్టా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘోష్, 1998 నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేశారని చెప్పారు.

గత 35 సంవత్సరాలుగా పార్టీ కోసం, ప్రజల కోసం ఘోష్ ఎంతో శ్రమించారని, ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని దీదీ కొనియాడారు. ఘోష్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన దీదీ…ఘోష్ భార్య ఝార్నా, బంధుమిత్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. ఘోష్ మృతిపట్ల పశ్చిమ బెంగాల్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

This post was last modified on June 24, 2020 4:42 pm

Share
Show comments
Published by
Satya
Tags: Corona

Recent Posts

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

57 minutes ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

3 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

8 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

9 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

10 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

10 hours ago