యువత, పేదల కోసమే తాను ప్రజలముందుకు వస్తున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రజలకు జరిగే నష్టం నివారించటానికి, భవిష్యత్తరాల కోసమే తాను పోరాడుతుంటే యువతలో ఎందుకు పౌరుషం రావటంలేదంటు మండిపడ్డారు. యువత ముందుకు రావాలని తన పోరాటంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు గట్టిగాకోరారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించారు. 72 ఏళ్ళ వయసులోను తాను చురుగ్గా పనిచేస్తుంటే యువతలో మాత్రం పౌరుషం కనిపించటంలేదన్నారు.
శ్రీలంక ప్రధానమంత్రిగా పనిచేసిన మహీంద రాజపక్సేకి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మహీందను పోలీసులు కూడా కాపాడలేకపోయారని కాబట్టి ఇక్కడ కూడా జగన్ను పోలీసులు కాపాడలేరని చెప్పారు. జగన్ లాంటి నియంతకు తాను భయపడేదిలేదన్నారు. మూడేళ్ళ జగన్ పాలన పూర్తిగా వైఫల్యాలే అని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వం దోపిడీని వివరించాలని చెప్పారు.
అప్పులతో జగన్ రాష్ట్రం పరువు తీసేసినట్లు చెప్పారు. మూడేళ్ళల్లో జగన్ ప్రభుత్వం రు. 8 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. గుంటూరుకు చెందిన వెంకాయమ్మ ప్రభుత్వం తీరుపై వాస్తవాలు చెబితే ఎందుకు దాడిచేశారంటు ప్రశ్నించారు. వైసీపీ ప్రకటించిన నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు టీడీపీ వాళ్ళే అంటు ఎద్దేవాచేశారు. తెలంగాణాకు చెందిన ఇద్దరికి ఏపీ కోటా నుండి ఎందుకు ఎంపికచేశారంటు నిలదీశారు. ఏపీలో సమర్ధులు లేరని తెలంగాణా నుండి ఎంపికచేశారా అంటు ఎద్దేవాచేశారు.
పులివెందులలో బస్టాండు కట్టలేని వాళ్ళు ఇక మూడు రాజధానులు కడతారా ? అంటు ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా నుండే టీడీపీ జైత్రయాత్ర మొదలవ్వాలని పిలుపిచ్చారు. రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం కడపజిల్లాలోని 10 అసెంబ్లీల్లో టీడీపీ ఒక్కటి కూడా గెలవలేదు. అలాగే రెండు లోక్ సభ సీట్లను కూడా వైసీపీనే గెలుచుకున్నది. మరి చంద్రబాబు పిలుపుమేరకు కడప జనాలు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.
This post was last modified on May 19, 2022 12:07 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…