Political News

జ‌గ‌న్ స‌వాలును స్వీకరించ‌నున్న బాబు ! సోలో ఫైటే సో బెట‌రు !

సింహం సింగిల్ గానే వ‌స్తుంది అని అంటున్నారు అంబ‌టి రాంబాబు లాంటి నాయ‌కులు. త‌మ నేత‌కు ప్ర‌జా క్షేత్రాన తిరుగులేద‌ని అంటున్నారు అంబ‌టితో స‌హా మిగ‌తా నాయ‌కులు కూడా ! త‌ప్పేం లేదు ఎవ‌రి విశ్వాసాలు వారికి ఉంటాయి. ఎవ‌రి నమ్మ‌కాలు వారివి అయి ఉంటాయి. వాటిని కాద‌నుకుని పార్టీలు మ‌నుగడ సాగించ లేవు కూడా ! నిండా మునిగాక కూడా ఎవ‌రో ర‌క్షిస్తార‌న్న న‌మ్మ‌కం ఒక‌టి మ‌నుషుల్లో ముఖ్యంగా నాయ‌కుల్లో ఉంటుంది.

ఆ విధంగా టీడీపీ కానీ ఆ విధంగా వైసీపీ కానీ రాజ‌కీయం చేయాల్సిందే ! తాజా ప‌రిణామాల్లో భాగంగా చాలా చోట్ల వైసీపీకి నిర‌స‌న స్వ‌రాలే ప‌ల‌క‌రిస్తున్నాయి. ముఖ్యంగా దాస‌న్న (మాజీ డిప్యూటీ సీఎం) లాంటి వారు అయితే నిర‌స‌న‌లను లైట్ తీసుకుంటున్నారు. లేదా స్థానిక నాయ‌క‌త్వాల‌ను ఆదేశించి మాట్లాడే గొంతుకలు మీడియా ముందుకు రాకుండా క‌ట్ట‌డి చేస్తున్నారు. ఇవేవీ లేకపోతే ఏంట్రా ! మనం అంతా ఒకే ఇంటి పేరోళ్లం ఎందుకిలా అడ్డుకుంటున్నారు అని కూడా చెప్పి.. ధ‌ర్మాన దాస‌న్న త‌ప్పుకుంటున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి.

క్షేత్ర స్థాయిలో మంత్రి వ‌ర్గానికి సంబంధించి జిల్లాల‌కు చెందిన ఇంఛార్జుల క‌న్నా పార్టీ ఇంఛార్జులే ఎక్కువ. అదేవిధంగా మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న ప్ర‌సాద‌రావు క‌న్నా కృష్ణ దాసే ఎక్కువ.. ప‌ద‌వి రీత్యా ప్రాధాన్య క్ర‌మం రీత్యా కూడా ! ఇదే ఒపీనియ‌న్ గ‌తంలో జ‌గ‌న్ బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌దే అది.

శ్రీ‌కాకుళం జిల్లాలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు హవా క‌న్నా ప‌ద‌వి ఉన్నా లేక‌పోయినా దాస‌న్న హ‌వా న‌డుస్తోంది. దాంతో వైసీపీలో గంద‌రగోళ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. అసంతృప్తులు బాగా పెరిగిపోతున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ కాళింగులు కొంత అనుకూలంగా ఉన్నా కృపారాణికి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో వాళ్లు కూడా కాస్త ఎడ‌ముఖం పెడ‌ముఖం అన్న చందంగానే పార్టీ అధినాయ‌క‌త్వంతో ఇక‌పై మెల‌గ‌నున్నారు అని తెలుస్తోంది. వెల‌మల్లో కాస్తో కూస్తో స‌ఖ్య‌త ఉన్నా కొంత ధ‌ర్మాన సోద‌రుల ఇంటి పోరు కార‌ణంగా వైసీపీకి ముందున్న కాలం క‌ష్ట‌మే ! దాదాపు ఐదు నియోజ‌క‌వ‌ర్గాలపై ఆ ప్ర‌భావం క‌నిపించ‌నుంది. ఇదే అదునుగా టీడీపీ బాగా బ‌ల‌పడుతోంది.

రెవెన్యూ మినిస్ట‌ర్ ధ‌ర్మాన, ఎడ్యుకేష‌న్ మినిష్ట‌ర్ బొత్స ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శ్రీ‌కాకుళం మ‌రియు చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ యువ నాయ‌క‌త్వాలు బ‌లంగా ఉన్నాయి. ఇక్క‌డ ఎంపీ రాము, ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం అక్కడ కిమిడి నాగార్జున, ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం బాగా ప‌నిచేస్తున్నారు.

దీంతో ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లో తీసుకుని ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డితే మిగిలిన ప్రాంతాలు సెంటిమెంట్ ప‌రంగా 4 కాదు 40 విధాలుగా క‌లిసి వ‌స్తాయ‌న్న ఆశ‌తో చంద్ర‌బాబు ఉన్నారు. అందుకే సింగిల్ గా వెళ్లేందుకు కూడా యోచిస్తున్నారు అని తెలుస్తోంది. పొత్తుల క‌న్నా ఈ విధంగా సింగిల్ గా వెళ్తేనే బాగుంటుంది అన్న ఆలోచ‌న కూడా చేస్తున్నారు అని తెలుస్తోంది. ఎలానూ బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయి క‌నుక., బీజేపీ ఇప్ప‌టికే చెప్పిన విధంగా కుటుంబ పార్టీల‌తో క‌ల‌వ‌దు క‌నుక చంద్ర‌బాబు ఈ విధంగా డెసిష‌న్ తీసుకునే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ్య‌లేం.

Satya

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

3 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

34 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago