Political News

జగన్ ఫాలో అయ్యేది ఈ రెండే

తాజాగా వైసీపీ తరపున ఎంపికైన నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణా వాళ్ళే కావటం గమనార్హం. నలుగురు ఎంపీ అభ్యర్ధుల్లో రెండు అగ్రకులాలకు, మరో రెండు వెనుకబడిన కులాలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కూడా పదవుల పంపిణీలో కానీ, ఎంపికలో కానీ జగన్ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ పదవిని జాగ్రత్తగా లెక్కలేసి మరీ సోషల్ ఇంజనీరింగ్ అమలుచేస్తున్నారు. సరే ఏది చేసిన అంతిమంగా రాజకీయంగా లబ్ది పొందడానికి అన్నది వాస్తవం.

రాజకీయంగా లబ్ది పొందడానికి ఒక్కొక్క వ్యూహం అమలు చేస్తారు. ఇందులో భాగంగా జగన్ సంక్షేమ పథకాల అమలు మ్యాగ్జిమమ్ చేస్తునే సోషల్ ఇంజనీరింగ్ కూడా పాటిస్తున్నారు. రాజకీయంగా ఈ రెండు అంశాలు జగన్ వ్యూహమనే అనుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. అదేమిటంటే తాజాగా ఎంపికైన నలుగురు రాజ్యసభ అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణా వాళ్ళు కావటం. తెలుగురాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపికి సంబంధించిన వాళ్ళు తెలంగాణా రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం లేదు.

అలాగే తెలంగాణా నేతలు కూడా ఏపీ వ్యవహారాల్లో ఎక్కడా కనబడటం లేదు. అంటే స్పష్టమైన విభజన ఉంది కాబట్టి ఒక రాష్ట్ర రాజకీయాల్లో మరొకరు జోక్యం చేసుకోవటం లేదు. అలాంటిది తెలంగాణాకు చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్, కృష్ణయ్యలను ఏపీ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయడమే ఆశ్చర్యంగా ఉంది. ఈ మాత్రం వ్యక్తులు ఏపీలో అందులోను పార్టీలో లేరా అంటే కచ్చితంగా ఉండే ఉంటారు.

అయితే ఎవరిని ఎంపిక చేయాలనేది పూర్తిగా జగన్ ఇష్టమే కాబట్టి ఎంపికను ప్రశ్నించేందుకు లేదు. గతంలో ఉత్తరాదికి చెందిన పరిమళ్ నత్వానీకి కూడా రాజ్యసభ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకేసారి ఇద్దరు తెలంగాణా వ్యక్తులకు కాకుండా ఒక్కోసారి ఒక్కరికి అవకాశం ఇచ్చుంటే బాగుండేదని చర్చ పార్టీలో నడుస్తోంది. ఏదేమైనా తెలంగాణా వాళ్ళకు కూడా ఏపీ రాజకీయాల్లో కీలక అవకాశాలు ఇవ్వటం అన్నది ఆశ్చర్యంగానే ఉంది.

This post was last modified on May 18, 2022 10:55 am

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

43 minutes ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

4 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

5 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

5 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

6 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 hours ago