Political News

చీరాల సమస్య పరిష్కారమైనట్లేనా ?

ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ పరంగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం సమస్య పరిష్కారమైనట్లేనా ? క్షేత్రస్థాయిలో పరిస్ధితులను చూస్తుంటే తాజా డెవలప్మెంట్ అలాగే అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరపున కరణం బలరామ్ పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోటీలో కరణం గెలిచారు. ఎప్పుడైతే అఖండ మెజారిటితో వైసీపీ అధికారంలోకి వచ్చిందో కొద్దిరోజులకే కరణం వైసీపీ మద్దతుదారుడిగా మారారు.

అప్పటినుండి కరణం-ఆమంచి వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాదం పరిష్కారానికి ఆమంచిని జగన్మోహన్ రెడ్డి పర్చూరు నియోజకవర్గం ఇన్చార్జిగా వెళ్ళమని చెప్పారు. అయితే దీన్ని ప్రిస్టేజిగా తీసుకున్న ఆమంచి పర్చూరుకు వెళ్ళటానికి ఇష్టపడలేదు. దాంతో రెండువర్గాల మధ్య గొడవలు మరింతగా పెరిగిపోయాయి. చివరకు ఈ గొడవలు పార్టీని బాగా దెబ్బతీసే పరిస్థితికి చేరుకున్నట్లు జగన్ దృష్టికి వెళ్ళింది.

అందుకనే ఆమంచిని పిలిపించుకుని పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జిగా వెళ్ళాలని జగన్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. అలాగే ఆమంచి అడిగిన కొన్ని విషయాలపైన కూడా జగన్ సానుకూలంగా స్పందించారట. దాంతో పర్చూరు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుని పనిచేయటానికి ఆమంచి అంగీకరించారు. దాంతో ఇటు చీరాల అటు పర్చూరు ఇన్చార్జి సమస్యలు పరిష్కారమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో చీరాల టికెట్ కరణంకే ఇస్తారా ? లేదా ఆయన కొడుకు వెంకటేష్ కే ఇస్తారా లేదా మరో నేతకు కేటాయిస్తారా అన్నది తెలీదు.

ఇదే సమయంలో పర్చూరు టికెట్ ఆమంచికి కేటాయించబోతున్నట్లు హామీ వచ్చిందంటున్నారు. మరి ఇదే నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కొడుకు మధుసూధనరెడ్డి పరిస్ధితి ఏమిటనే విషయం తేలాలి. మొత్తానికి చీరాల, పర్చూరులో పార్టీ ఇన్చార్జీల విషయంలో అయోమయమైతే క్లియర్ అయిపోయిందనే అనుకోవాలి. ఇప్పటినుండైనా ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీస్ ఊపందుకుంటాయా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

This post was last modified on May 17, 2022 11:17 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

52 seconds ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

51 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

55 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago