Political News

ఏపీలో ఆ ప‌రీక్ష‌లు కూడా ర‌ద్దు

క‌రోనా దెబ్బ‌కు ఈ ఏడాది అన్ని కార్య‌క‌లాపాలూ నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు ఏవీ ఇప్పుడిప్పుడే తెరుచుకునే ప‌రిస్థితి లేదు. చాలా త‌ర‌గ‌తుల‌వి ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించుకోలేని ప‌రిస్థితి త‌లెత్తింది. మార్చిలో టెన్త్, డిగ్రీ ప‌రీక్ష‌ల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం మొదలైంది. వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా లాక్ డౌన్ విధించ‌డం.. దాన్ని పొడిగించుకుంటూ వెళ్ల‌డంతో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సాధ్య‌ప‌డ‌లేదు.

ఈ నేప‌థ్యంలో ముందు తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశారు. కానీ ఏపీలో మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌రీక్ష‌లు జ‌ర‌పాల్సిందే అని ప‌ట్టుద‌ల‌తో క‌నిపించిన సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం త‌ర్వాత మ‌న‌సు మార్చుకోక త‌ప్ప‌లేదు. ఇటీవ‌లే అక్క‌డ కూడా టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు మ‌రికొన్ని త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వ్యాప్తి రాష్ట్రంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అలాగే డిగ్రీ మొద‌టి, రెండో ఏడాది విద్యార్థుల‌ను ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోట్ చేయాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది.

డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫైన‌ల్ సెమిస్ట‌ర్ ర‌ద్దయిన నేప‌థ్యంలో గ్రేడింగ్ లేదా మార్కుల విష‌యంలో ఏం చేయాలో స్థానిక విశ్వ‌విద్యాల‌యాల ఎగ్జిక్యూటివ్ క‌మిటీలు చ‌ర్చించి నిర్ణ‌యిం తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్ద‌యినప్ప‌టి నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులు త‌మ ప‌రిస్థితేంట‌ని అడుగుతున్నారు. ఇప్పుడు వారికీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. తెలంగాణ‌లోనూ ఇదే నిర్ణ‌యం తీసుకోవ‌డం లాంఛ‌న‌మే అని భావిస్తున్నారు.

This post was last modified on June 24, 2020 10:22 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

3 hours ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

3 hours ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

4 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

7 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

9 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

10 hours ago