కరోనా దెబ్బకు ఈ ఏడాది అన్ని కార్యకలాపాలూ నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు ఏవీ ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు. చాలా తరగతులవి పరీక్షలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి తలెత్తింది. మార్చిలో టెన్త్, డిగ్రీ పరీక్షలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం.. దాన్ని పొడిగించుకుంటూ వెళ్లడంతో పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు.
ఈ నేపథ్యంలో ముందు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. కానీ ఏపీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు జరపాల్సిందే అని పట్టుదలతో కనిపించిన సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం తర్వాత మనసు మార్చుకోక తప్పలేదు. ఇటీవలే అక్కడ కూడా టెన్త్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరికొన్ని తరగతుల పరీక్షలను కూడా రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డిగ్రీ మొదటి, రెండో ఏడాది విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్ రద్దయిన నేపథ్యంలో గ్రేడింగ్ లేదా మార్కుల విషయంలో ఏం చేయాలో స్థానిక విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కమిటీలు చర్చించి నిర్ణయిం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. టెన్త్ పరీక్షలు రద్దయినప్పటి నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులు తమ పరిస్థితేంటని అడుగుతున్నారు. ఇప్పుడు వారికీ ఉపశమనం లభించింది. తెలంగాణలోనూ ఇదే నిర్ణయం తీసుకోవడం లాంఛనమే అని భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…