Political News

వైసీపీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఖాయమేనా?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ….ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచతమైన పేరు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ…జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే, జనసేనాని మళ్లీ సినిమాలు చేయాలన్న నిర్ణయం నచ్చని లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు.

బీజేపీలో చేరేందుకు లక్ష్మీనారాయణ పావులు కదపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, గతంలో కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. తాజాగా, మరోసారి జగన్ పాలనపై లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే వైసీపీలో లక్ష్మీనారాయణ చేరబోతున్నారంటూ మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రజలను, సమాజాన్ని, దేశ ఆలోచనా విధానాన్ని మార్చే విధంగా ఏదైనా రాజకీయ పార్టీ ముందుకు వస్తే…అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని వైసీపీలో చేరికపై లక్ష్మీనారాయణ గతంలో పరోక్షంగా సమాధానమిచ్చారు. తాజాగా జగన్ పాలన బాగుందన్న జేడీ…మొదట్లో జగన్ పాలనపై అనుమానం ఉండేదని సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.

జగన్ కు రాజ్యాంగంపై మంచి పట్టు ఉందని, జగన్ సీఎం అయిన తర్వాత….గ్రామాల్లో పరిస్థితి మారిందని అన్నారు. దశలవారీ మద్య నిషేధంతో గ్రామాల్లో ఆడవాళ్లు సంతోషంగా ఉన్నారని…ఈ విషయంలో జగన్ కమిట్మెంట్ నచ్చిందని కితాబిచ్చారు. ఈ ప్రకటనలను బట్టి….జగన్ కు జేడీ జై కొడుతున్నారని, త్వరలోనే వైసీపీలో చేరతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, జగన్ ను జైలుకు పంపడంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాత్ర ఉందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, జగన్ పై కేసులు రాజకీయ కక్ష్యతో పెట్టారని, విధి నిర్వహణలో భాగంగానే తాను ఆ కేసులను విచారణ జరిపానని లక్ష్మీనారాయణ పరోక్షంగా అన్నారు. ఈ నేపథ్యంలో ఒక వేళ లక్ష్మీనారాయణ వైసీపీలోకి వస్తానంటే…జగన్ చేర్చుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.

అయితే, జగన్ ను ఒక అధికారిగా ఎంత ఇబ్బంది పెట్టినా..లక్ష్మీనారాయణను పార్టీలోకి చేర్చుకోవడానికే జగన్ మొగ్గు చూపుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జేడీయే పార్టీలో చేరితే జగన్ పై కేసులు తప్పు అని జనం అనుకుంటారని తద్వారా వైసీపీ మానసికంగా బలపడుతుందన్నది వైసీపీ అధిష్టానం ఆలోచన. వైసీపీలోకి జేడీ వచ్చాడంటే జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్లేనని వైసీపీ థింక్ ట్యాంక్ అనుకుంటోందట. మరి, ఈ ఊహాగానాల్లో వాస్తవమెంత…అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

This post was last modified on June 23, 2020 10:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

51 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

6 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

7 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

9 hours ago