ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపై కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఇంత సూటిగా.. చురుకు తగిలేలా వ్యాఖ్యలు చేసిన నేతలు లేరనే చెప్పాలి. ఏపీకి చెందిన బీజేపీ నేతలు జగన్ సర్కారుపై విమర్శలు చేసినా కూడా ఇంత ఘాటుగా చేయలేదన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం కొనసాగుతోందని.. అవినీతి.. ఆరాచకం.. దౌర్జన్యాలు కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఏదైనా ప్రదర్శనలో పాల్గొన్నా.. సోషల్ మీడియాలో అభిప్రాయాల్ని వెల్లడించినా.. పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నట్లుగా మండిపడ్డారు. తనకు సైతం కంప్లైంట్లు వస్తున్నట్లుగా వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి.. ‘‘ఏపీలో అహంకార పాలన సాగుతోంది’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో హైదరాబాద్ నుంచి మాట్లాడిన ఆయన.. నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.
అప్పట్లో చంద్రబాబు హయాంలో అవినీతి.. అసత్యాల పాలన సాగితే.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి డీసెంట్రలైజ్ అయ్యిందన్నారు. సీఎం పదవులు చేపట్టిన రాయలసీమ నేతలు.. తమ ప్రాంతాన్ని మాత్రం డెవలప్ చేయలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి ప్రాజెక్టులు.. నిధులు తీసుకొని కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న ఆయన తీరుచూస్తే.. జగన్.. చంద్రబాబుకు ప్రత్యామ్నాం తామేనన్న విషయాన్ని తన విమర్శలతో చెప్పే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.
ఓపక్క కేంద్రంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సఖ్యతగా ఉన్నప్పటికీ.. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా కీలకమన్న మాట వినిపిస్తోంది. ఇంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడాలంటే కచ్ఛితంగా మోడీషాల పర్మిషన్ ఉండి ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారిచ్చిన సంకేతాలతోనే కిషన్ రెడ్డి ఇంతలా చెలరేగిపోయి ఉంటారంటున్నారు. అదే నిజమైతే.. జగన్ ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on June 23, 2020 1:33 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…