లోకేష్ను గెలిపించుకోలేని.. చంద్రబాబుకు చీర పంపాలా.. చుడీదార్ పంపించాలా? అంటూ.. ఏపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు.. వంగలపూడి అనిత.. ఫైరయ్యారు. తన తల్లిని గెలిపించుకోలేని జగన్కు.. ఏ చీరపంపించాలంటూ.. ఆమె నిప్పులు చెరిగారు.
అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకు రాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి రోజాను ఉద్దేశించి అనిత దుయ్యబట్టారు. “ఒక అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి, నాగమ్మ, ఈరోజు తెనాలి.. ఇలా వివాహితలు బలవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ కారణం కాదా?“ అని ప్రశ్నించారు.
లోకేశ్ గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటున్నారని, ముఖ్యమంత్రిలా ఇల్లు దాటి బయటకురాకుండా, పోలీస్ పహారా లేకుండా బయటకురాలేని దుస్థితిలో లేరని అన్నారు. లోకేశ్ ఓడిపోయారంటున్న రోజా ఓడి పోలేదా? అని ప్రశ్నించారు. తల్లిని విశాఖపట్నంలో గెలిపించుకోలేని జగన్ ఏరంగు చీరకట్టుకోవాలో రోజా చెప్పాలన్నారు.
“మహిళా సాధికారతంటే కచ్చాబాదం డాన్స్ లేస్తూ, జబర్దస్త్ షో కోసం నవ్వు రాకపోయినా.. పడిపడి నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదమ్మా రోజా“ అంటూ అనిత ఎద్దేవా చేశారు. మేం ఊరికో ఉన్మాది అంటే ఉలిక్కిపడుతున్నారెందుకని ప్రశ్నించారు. టీడీపీ పుస్తకం విడుదలచేశాకే వైసీపీ నేతల్లో చలనం వచ్చిందన్నారు. ఊరికో ఉన్మాది ఉన్నాడని తాము, తమపార్టీ నిరూపిస్తుందని.. అందుకు వైసీపీ నేతలు సిద్ధమా? అని సవాల్ చేశారు.
గుంటూరులో బాలికను నిర్బంధించి రోజుల తరబడి అత్యాచారం చేసింది వైసీపీకి చెందిన ఉన్మాదులు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉండి.. రోజా ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. మీ లాంటి వారందరికీ ఎన్నిచీరలు కావాలో చెబుతే పంపిస్తామన్నారు. జగన్ రెడ్డి, భారతి గురించి మాట్లాడితే ఊరుకోవా.. ఆడబిడ్డలను కాపాడలేని అసమర్థుడి గురించి మళ్లీ మళ్లీ మాట్లాడతామని, సాటి ఆడబిడ్డగా మహిళలపై జరిగే దారుణాలపై స్పందించలేని సీఎం సతీమణి గురించి మాట్లాడతామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
This post was last modified on April 29, 2022 9:17 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…