Political News

ఢిల్లీ వెళ్తున్న రఘురామకృష్ణంరాజు, ఎవరితో మీటింగ్?

వైసీపీ తరఫున నరసాపురం నుండి గెలుపొందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వివిధ సందర్భాల్లో పార్టీ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు అంశాల్లో ఆయన తన వైఖరిని సూటిగా చెప్పేస్తుండటంతో పార్టీకి, ఆయనకు మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల ఆయన మరో అడుగు ముందుకేసి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. తనను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. హోంమంత్రికి కూడా లేఖ రాశారు.

అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి, స్థానిక పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది తన దిష్టిబొమ్మను తగులబెట్టి, ఫ్లెక్సీలను టమాటాలు, కోడిగుట్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా ఆయన ఢిల్లీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని బెదిరించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇలాంటి టెన్షన్ పరిస్థితుల్లో ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, కేవలం ఫిర్యాదు చేసేందుకే వెళ్తున్నారా? ఇంకేదైనా కారణముందా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీకి పయనమవుతున్న ఆయన లోకసభ స్పీకర్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారని తెలుస్తోంది. అపాయింట్‌మెంట్ ఖరారయిందని చెబుతున్నారు. వైసీపీతో దూరం.. బీజేపీ నేతలకు దగ్గర కావడం వైసీపీ క్యాడర్‌లో ఆందోళన కలిగిస్తోందట. వైసీపీ, టీడీపీ, జనసేనలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోన్న బీజేపీ ఏపిలో కొత్త అధ్యక్షుడి కోసం చాలా రోజులుగా వెతుకులాట ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోను ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 22, 2020 11:50 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

34 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

56 minutes ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

1 hour ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

2 hours ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

5 hours ago