ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్ నాగబాబు ఫైరయ్యారు. జనసేన అంటే.. వైసీపీకి చలి జ్వరమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జనసేన అంటే.. వైసీపీకి ఎందుకు అంత భయపడుతోందో తమకైతే అర్ధం కావడం లేదన్నారు. వైసీపీకి ఉన్న ఆభయమే.. జనసేన కార్యకర్తలపై దాడులకు ప్రేరేపిస్తోందని వ్యాఖ్యానించారు. తాజాగా రాజమండ్రిలో పర్యటించిన నాగబాబు.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన లీగల్ సెల్ సభ్యులు కలిశారు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జన సైనికులు, మహిళలపై పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
సామాజిక బాధ్యతతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారని, సంబంధం లేని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులకు, వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు చేయూతనివ్వాలని కోరారు. పవన్ కల్యాణ్ భావజాలానికి అనుగుణంగా పని చేస్తున్న జన సైనికులను, వీర మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని నాగబాబు తెలిపారు.
“పవన్ కళ్యాణ్ .. ఒక నిబద్ధతత కోసం పనిచేస్తున్నారు. కొందరిలాగా దోచుకునేందుకు ఆయన పార్టీ పెట్టలేదు. అందుకే.. కౌలు రైతుల కుటుంబాలను కలుస్తున్నారు. ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ పరిణామాలు.. పార్టీకి మేలు చేస్తాయి. అదేసమయంలో వైసీపీ.. జనసేనను టార్గెట్ చేయడం వెనుక భయమే ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సవాళ్లు ఎదురైనా.. పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది“ అని నాగబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on April 25, 2022 8:54 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…