ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్ నాగబాబు ఫైరయ్యారు. జనసేన అంటే.. వైసీపీకి చలి జ్వరమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జనసేన అంటే.. వైసీపీకి ఎందుకు అంత భయపడుతోందో తమకైతే అర్ధం కావడం లేదన్నారు. వైసీపీకి ఉన్న ఆభయమే.. జనసేన కార్యకర్తలపై దాడులకు ప్రేరేపిస్తోందని వ్యాఖ్యానించారు. తాజాగా రాజమండ్రిలో పర్యటించిన నాగబాబు.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన లీగల్ సెల్ సభ్యులు కలిశారు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జన సైనికులు, మహిళలపై పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
సామాజిక బాధ్యతతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారని, సంబంధం లేని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులకు, వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు చేయూతనివ్వాలని కోరారు. పవన్ కల్యాణ్ భావజాలానికి అనుగుణంగా పని చేస్తున్న జన సైనికులను, వీర మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని నాగబాబు తెలిపారు.
“పవన్ కళ్యాణ్ .. ఒక నిబద్ధతత కోసం పనిచేస్తున్నారు. కొందరిలాగా దోచుకునేందుకు ఆయన పార్టీ పెట్టలేదు. అందుకే.. కౌలు రైతుల కుటుంబాలను కలుస్తున్నారు. ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ పరిణామాలు.. పార్టీకి మేలు చేస్తాయి. అదేసమయంలో వైసీపీ.. జనసేనను టార్గెట్ చేయడం వెనుక భయమే ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సవాళ్లు ఎదురైనా.. పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది“ అని నాగబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on April 25, 2022 8:54 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…