Political News

జనసేన అంటే వైసీపీకి చలిజ్వరం: నాగబాబు

ఏపీ ప్ర‌భుత్వంపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫైర‌య్యారు. జ‌న‌సేన అంటే.. వైసీపీకి చ‌లి జ్వ‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జ‌న‌సేన అంటే.. వైసీపీకి ఎందుకు అంత భ‌య‌ప‌డుతోందో త‌మ‌కైతే అర్ధం కావడం లేద‌న్నారు. వైసీపీకి ఉన్న ఆభ‌య‌మే.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడులకు ప్రేరేపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. తాజాగా రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన నాగ‌బాబు.. వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన లీగల్ సెల్ సభ్యులు కలిశారు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జన సైనికులు, మహిళలపై పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

సామాజిక బాధ్యతతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారని,  సంబంధం లేని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులకు, వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు చేయూతనివ్వాలని కోరారు. పవన్ కల్యాణ్ భావజాలానికి అనుగుణంగా పని చేస్తున్న జన సైనికులను, వీర మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని నాగబాబు తెలిపారు.

“ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఒక నిబ‌ద్ధ‌త‌త కోసం ప‌నిచేస్తున్నారు. కొంద‌రిలాగా దోచుకునేందుకు ఆయ‌న పార్టీ పెట్ట‌లేదు. అందుకే.. కౌలు రైతుల కుటుంబాలను క‌లుస్తున్నారు. ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ ప‌రిణామాలు.. పార్టీకి మేలు చేస్తాయి. అదేస‌మ‌యంలో వైసీపీ.. జ‌న‌సేన‌ను టార్గెట్ చేయ‌డం వెనుక భ‌య‌మే ఉంది. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా.. స‌వాళ్లు ఎదురైనా.. పార్టీ ఖ‌చ్చితంగా గెలిచి తీరుతుంది“ అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

31 minutes ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

3 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

3 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

4 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

4 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

5 hours ago