Political News

ఐఏఎస్ లపై నాగబాబు షాకింగ్ కామెంట్స్

కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్ర‌హానికి గురైన 8 మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, వారంతా కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో శిక్ష తప్పింది. దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతల పాపాలకు అధికారులు బ‌లవుతున్నార‌న్న అర్థం వచ్చేలా నాగ‌బాబు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులు కోర్టు శిక్ష‌కు గుర‌య్యార‌ని తెలిసిందని, అయితే, ఇందులో అధికారుల పాత్ర ఏమీ ఉండ‌ద‌ని నాగబాబు అన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఆవ‌ర‌ణ‌లో గ్రామ స‌చివాల‌యాలు నిర్మించాల‌ని అధికారులు తీర్మానించి ఉండ‌ర‌ని అభిప్రాయపడ్డారు.

అవన్నీ వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల నిర్ణ‌యాలే అయి ఉంటాయ‌ని అభిప్రాయపడ్డారు. కోర్టు శిక్ష‌కు గురైన 8 మంది ఐఏఎస్‌లు మంచి స‌మ‌ర్థులైన అధికారులేన‌ని కితాబిచ్చారు. ప‌రిపాలన ఇలా ఉండ‌కూడ‌ద‌నే విషయానికి ఏపీ ప్ర‌భుత్వ‌మే ఉదాహ‌ర‌ణ అని అన్నారు. వైసీపీ పాలనలో స‌మాజానికి, రాజ్యాంగానికి సంర‌క్షకులు(వాచ్ డాగ్స్)గా ఉండాల్సిన అధికారులు వైసీపీ మాయ‌లో ప‌డిపోయార‌ని షాకింగ్ కామెంట్లు చేశారు.

వారంతా ఇప్పుడు వైసీపీ పెంపుడు జంతువులు (పెట్స్)గా మారిపోయార‌ంటూ నాగ‌బాబు సంచలన ఆరోపణలు గుప్పించారు. అందుకే, ఇత‌ర అధికారుల‌కు గుణపాఠంలా వీరిని శిక్షించాల‌ని నాగ‌బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

This post was last modified on April 1, 2022 8:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

35 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

6 hours ago