కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, వారంతా కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో శిక్ష తప్పింది. దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతల పాపాలకు అధికారులు బలవుతున్నారన్న అర్థం వచ్చేలా నాగబాబు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులు కోర్టు శిక్షకు గురయ్యారని తెలిసిందని, అయితే, ఇందులో అధికారుల పాత్ర ఏమీ ఉండదని నాగబాబు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు నిర్మించాలని అధికారులు తీర్మానించి ఉండరని అభిప్రాయపడ్డారు.
అవన్నీ వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్ణయాలే అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. కోర్టు శిక్షకు గురైన 8 మంది ఐఏఎస్లు మంచి సమర్థులైన అధికారులేనని కితాబిచ్చారు. పరిపాలన ఇలా ఉండకూడదనే విషయానికి ఏపీ ప్రభుత్వమే ఉదాహరణ అని అన్నారు. వైసీపీ పాలనలో సమాజానికి, రాజ్యాంగానికి సంరక్షకులు(వాచ్ డాగ్స్)గా ఉండాల్సిన అధికారులు వైసీపీ మాయలో పడిపోయారని షాకింగ్ కామెంట్లు చేశారు.
వారంతా ఇప్పుడు వైసీపీ పెంపుడు జంతువులు (పెట్స్)గా మారిపోయారంటూ నాగబాబు సంచలన ఆరోపణలు గుప్పించారు. అందుకే, ఇతర అధికారులకు గుణపాఠంలా వీరిని శిక్షించాలని నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
This post was last modified on April 1, 2022 8:33 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…