Political News

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

మహమ్మారి వైరస్ భారత్ పై పంజా విసురుతోన్న సంగతి తెలిసిందే. రోజుకు సుమారు పది వేల వరకు కేసులు నమోదువుతుండడంతో కేంద్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇక, ఏపీ, తెలంగాణలోనూ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రాణాంతక వైరస్ దెబ్బకు భయపడి ఇప్పటికేే తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. అయితే, ఏపీలో మాత్రం ఫిజికల్ డిస్టన్స్ పాటిస్తూ….పరీక్షలను నిర్వహించాలని ఏపీ సర్కార్ భావించింది. అయితే, కేసుల తీవ్రత…కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

దీంతోపాటు, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు సురేష్‌ ప్రకటించారు. ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సురేష్‌ వెల్లడించారు. మరోవైపు, ఇప్పటికే తెలంగాణ, తమిళనాడులో విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా టెన్త్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు సీబీఎస్ ఈ కూడా పలు పరీక్షలను రద్దు చేసింది. పరీక్షల నిర్వహణకన్నా విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని భావించిన పలు ప్రభుత్వాలు…టెన్త్, ఇంటర్ తో పాటు పలు పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్ లను రద్దుచేశాయి.

This post was last modified on June 20, 2020 7:12 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు…

50 mins ago

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

2 hours ago

చిన్న దర్శకుడి మీద పెద్ద బాధ్యత

మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…

2 hours ago

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

4 hours ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

4 hours ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

4 hours ago