Political News

ట్రంప్ కు ఎదురుగాలి.. ప్రత్యర్థి ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరుగుతుున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి మరోసారి ఎన్నిక కావాలని ట్రంప్ కోరుతుంటే.. మరోసారి ఆయన చేతిలో పాలనా పగ్గాలు ఉంటే అగ్రరాజ్యానికి గడ్డుపరిస్థితే అన్న భావన వ్యక్తమవుతోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారికి ముందంతా ట్రంప్ జోరు సాగినా.. ఇప్పుడు మాత్రం లెక్కల్లో తేడా వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ట్రంప్ కు ప్రత్యర్థిగా బరిలో నిలిచారు డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్. తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే 12 పాయింట్ల అధిక్యతతో బైడెన్ ముందున్నారు. జూన్ 13 నుంచి పదహారువరకు ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ట్రంప్ ప్రత్యర్థి అధిక్యతను ప్రదర్శిస్తున్నారు.

సర్వేలో పాల్గొన్న అమెరికన్లలో అత్యధికులు.. జాత్యహంకారం.. నిరుద్యోగం.. కరోనా లాంటి సమస్యలు దేశ స్థిరత్వానికి ప్రధాన ముప్పుగా భావించే వారు ఎక్కువ అవుతున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది బైడెన్ కు మద్దతు పలకగా.. ట్రంప్ కు 38 శాతం మంది మాత్రమే ఓకే చెబుతున్నారు. గత నెలలో ఎనిమిది పాయింట్ల అధిక్యతను ప్రదర్శించిన బైడెన్.. ఇప్పుడుతన పరిస్థితిని మరింత మెరుగుపర్చుకుంటుంటే.. ట్రంప్ వెనుకబడిపోతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజాగా జరిగే ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారితో పాటు.. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు వెల్లువెత్తటం.. అత్యధికులు ట్రంప్ నకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు నెలల పాటు సాగితే.. ట్రంప్ కు దెబ్బ పడటం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on June 20, 2020 12:50 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

15 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

19 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago