గడిచిన కొద్ది రోజులుగా మాయదారి రోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు పలు సూచనలు చేయటం తో పాటు..కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తగినన్ని నిర్దారణ పరీక్షలు నిర్వహించటం లేదని.. వైద్యులకు తగినన్ని రక్షణ పరికరాలు అందుబాటులో లేవంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాఖ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్.. జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుతో పాటు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వీడియోకాన్ఫరెన్సులో హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పీపీఈ కిట్ లు.. ఎన్95 మాస్కుల కేటాయింపుతో పాటు.. 274 మంది పోలీసులతో వైద్యులకు.. వైద్య సిబ్బందికి కల్పిస్తున్న చర్యల గురించి వివరించారు.
వీరు చెప్పిన వివరాలతో పాటు.. న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ సర్కారుకు పలు సూచనలు చేసింది. ఇంతకూ హైకోర్టు ఏం చెప్పిందన్నది చూస్తే..
— గాంధీ ఆసుపత్రితో పాటు కొవిడ్ ఆసుపత్రులుగా గుర్తించిన వాటి జాబితాను ప్రచురించాలి
— కేరళ అనుసరిస్తున్నట్లుగా ఆర్ టీ – పీసీఆర్ పరీక్షల్ని నిర్వహించటానికి ఉన్న ఇబ్బందులేమిటి?
— ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే నివేదిక ఇవ్వండి
— కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచాలి
— యాంటిజెన్ టెస్టింగ్ కిట్స్ ను వినియోగించాలి. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షల్ని నిర్వహించాలి
— పాజిటివ్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని రోజూ ప్రకటించాలి.
— కేవలం మీడియా బులెటిన్ లకే పరిమితం కావొద్దు.
— అన్ని ప్రాంతీయ వార్తా పత్రికల్లో ప్రచురించాలి.
— జీహెచ్ఎంసీ వార్డుల వారీగా కేసుల వివరాల్ని ప్రకటించాలి. కాలనీ సంఘాలకు తెలియజేయాలి
— గాంధీ ఆసుపత్రిలో మాదిరి మాయదారి రోగానికి చికిత్స అందించే ప్రైవేటు ఆసుపత్రులు కూడా ప్రతిరోజు సగం మంది వైద్య సిబ్బందితో పని చేయించేలా ప్రభుత్వం సూచన చేయాలి
— గాంధీతో సహా కొవిడ్ ఆసుపత్రులకు పోలీసు భద్రత కల్పించాలి
This post was last modified on June 19, 2020 5:16 pm
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…