గడిచిన కొద్ది రోజులుగా మాయదారి రోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు పలు సూచనలు చేయటం తో పాటు..కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తగినన్ని నిర్దారణ పరీక్షలు నిర్వహించటం లేదని.. వైద్యులకు తగినన్ని రక్షణ పరికరాలు అందుబాటులో లేవంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాఖ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్.. జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుతో పాటు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వీడియోకాన్ఫరెన్సులో హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పీపీఈ కిట్ లు.. ఎన్95 మాస్కుల కేటాయింపుతో పాటు.. 274 మంది పోలీసులతో వైద్యులకు.. వైద్య సిబ్బందికి కల్పిస్తున్న చర్యల గురించి వివరించారు.
వీరు చెప్పిన వివరాలతో పాటు.. న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ సర్కారుకు పలు సూచనలు చేసింది. ఇంతకూ హైకోర్టు ఏం చెప్పిందన్నది చూస్తే..
— గాంధీ ఆసుపత్రితో పాటు కొవిడ్ ఆసుపత్రులుగా గుర్తించిన వాటి జాబితాను ప్రచురించాలి
— కేరళ అనుసరిస్తున్నట్లుగా ఆర్ టీ – పీసీఆర్ పరీక్షల్ని నిర్వహించటానికి ఉన్న ఇబ్బందులేమిటి?
— ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే నివేదిక ఇవ్వండి
— కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచాలి
— యాంటిజెన్ టెస్టింగ్ కిట్స్ ను వినియోగించాలి. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షల్ని నిర్వహించాలి
— పాజిటివ్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని రోజూ ప్రకటించాలి.
— కేవలం మీడియా బులెటిన్ లకే పరిమితం కావొద్దు.
— అన్ని ప్రాంతీయ వార్తా పత్రికల్లో ప్రచురించాలి.
— జీహెచ్ఎంసీ వార్డుల వారీగా కేసుల వివరాల్ని ప్రకటించాలి. కాలనీ సంఘాలకు తెలియజేయాలి
— గాంధీ ఆసుపత్రిలో మాదిరి మాయదారి రోగానికి చికిత్స అందించే ప్రైవేటు ఆసుపత్రులు కూడా ప్రతిరోజు సగం మంది వైద్య సిబ్బందితో పని చేయించేలా ప్రభుత్వం సూచన చేయాలి
— గాంధీతో సహా కొవిడ్ ఆసుపత్రులకు పోలీసు భద్రత కల్పించాలి
This post was last modified on June 19, 2020 5:16 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…