Political News

ఏపీ-తెలంగాణ బస్సులు.. ఇంకో వారంలోనే

లాక్ డౌన్ షరతుల్లో 90 శాతం దాకా సడలించేసింది కేంద్ర ప్రభుత్వం. అంతర్ రాష్ట్ర సర్వీసులకు కూడా అనుమతి ఇచ్చింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు మాత్రం నడవట్లేదు. వ్యక్తిగత వాహనాల్లో వెళ్లే వాళ్లు వెళ్తున్నారు. కొన్ని స్పెషల్ రైళ్లు పెట్టి నడిపిస్తున్నారు. కానీ ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం నడపట్లేదు.

మూడు వారాల కిందటే తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి బస్సులు నడిపేందుకు అంగీకారం తెలిపింది. కానీ ఏపీ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆ రాష్ట్రం కూడా అంతర్ రాష్ట్ర సర్వీసులకు పచ్చ జెండా ఊపబోతోందని అంటూనే ఉన్నారు కానీ.. ఎంతకీ విషయం తేలలేదు.

రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఈ విషయం ముందడుగు పడలేదు. కానీ ఇలా ఎంతో కాలం గేట్లు మూసేస్తే కష్టమని.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావించినట్లున్నాయి.

ఎట్టకేలకు అంతర్ రాష్ట్ర సర్వీసులకు ఇరు రాష్ట్రాలూ ఉమ్మడిగా పచ్చజెండా ఊపినట్లే కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున అధికారుల మధ్య చర్చలు జరిగాయి. తెలంగాణ అధికారులు.. విజయవాడకు వెళ్లి అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. ఇంకో వారం రోజుల్లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. వెంటనే బుకింగ్స్ మొదలవుతాయి. ఇంతకుముందే తెలంగాణ నుంచి ఏపీకి కొన్ని ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా హైదరాబాద్‌లో చిక్కుకున్న వాళ్లను స్వరాష్ట్రానికి రప్పించడానికి ఏపీ ప్రయత్నం చేసింది. బుకింగ్స్ కూడా జరిగాయి. కానీ చివరి నిమిషాల్లో అవన్నీ రద్దు చేశారు.

ఈసారి మాత్రం వెనకడుగు ఉండదని.. వారం రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని.. దీంతో పాటే ప్రైవేటు బస్సులకు కూడా అనుమతులు ఇస్తారని.. కరోనా జాగ్రత్తల మధ్య బస్సులు నడిపేలా జాగ్రత్తలు తీసుకుంటారని అంటున్నారు.

This post was last modified on June 19, 2020 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

38 minutes ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

3 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

3 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

4 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

4 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

6 hours ago