Political News

చిరు సినిమాకు, స్కూళ్లకు లింకు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నవ్వులు పూయించారు. గతంలోనూ పలుమార్లు తన అమాయకపు మాటలతో…భోళాగా మాట్లాడి కామెడీ చేసిన మధుసూదన్ రెడ్డి మరోసారి జబర్దస్త్ కామెడీ చేేశారు.

జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని కితాబిచ్చిన మధుసూదన్ రెడ్డి…ఆ తర్వాత పంచ్ లు వేశారు. చిరంజీవి కొత్త సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని, అదే తరహాలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందని మధుసూదన్ అనడంతో సభలో నవ్వులు విరిసాయి.

అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని చెప్పిన మధుసూదన్ రెడ్డి…ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నో అడ్మిషన్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ తమ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ప్రైవేటుపాఠశాలలపై మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎస్టీ పాఠశాలలు కూడా బెంచీలు, టీవీ సెట్లతో అద్భుతంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ప్రతిపక్ష నాయకులు వచ్చి చూడాలని కూడా మధుసూదన్ రెడ్డి కోరండం కొసమెరుపు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

9 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

15 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

29 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago