అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నవ్వులు పూయించారు. గతంలోనూ పలుమార్లు తన అమాయకపు మాటలతో…భోళాగా మాట్లాడి కామెడీ చేసిన మధుసూదన్ రెడ్డి మరోసారి జబర్దస్త్ కామెడీ చేేశారు.
జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని కితాబిచ్చిన మధుసూదన్ రెడ్డి…ఆ తర్వాత పంచ్ లు వేశారు. చిరంజీవి కొత్త సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని, అదే తరహాలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందని మధుసూదన్ అనడంతో సభలో నవ్వులు విరిసాయి.
అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని చెప్పిన మధుసూదన్ రెడ్డి…ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నో అడ్మిషన్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ తమ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ప్రైవేటుపాఠశాలలపై మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎస్టీ పాఠశాలలు కూడా బెంచీలు, టీవీ సెట్లతో అద్భుతంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ప్రతిపక్ష నాయకులు వచ్చి చూడాలని కూడా మధుసూదన్ రెడ్డి కోరండం కొసమెరుపు.
This post was last modified on March 11, 2022 8:35 pm
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…
ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలవడం…
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్కు మద్దతు పలికిన…
నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…