అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నవ్వులు పూయించారు. గతంలోనూ పలుమార్లు తన అమాయకపు మాటలతో…భోళాగా మాట్లాడి కామెడీ చేసిన మధుసూదన్ రెడ్డి మరోసారి జబర్దస్త్ కామెడీ చేేశారు.
జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని కితాబిచ్చిన మధుసూదన్ రెడ్డి…ఆ తర్వాత పంచ్ లు వేశారు. చిరంజీవి కొత్త సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని, అదే తరహాలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందని మధుసూదన్ అనడంతో సభలో నవ్వులు విరిసాయి.
అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని చెప్పిన మధుసూదన్ రెడ్డి…ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నో అడ్మిషన్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ తమ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ప్రైవేటుపాఠశాలలపై మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎస్టీ పాఠశాలలు కూడా బెంచీలు, టీవీ సెట్లతో అద్భుతంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ప్రతిపక్ష నాయకులు వచ్చి చూడాలని కూడా మధుసూదన్ రెడ్డి కోరండం కొసమెరుపు.
This post was last modified on March 11, 2022 8:35 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…