అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నవ్వులు పూయించారు. గతంలోనూ పలుమార్లు తన అమాయకపు మాటలతో…భోళాగా మాట్లాడి కామెడీ చేసిన మధుసూదన్ రెడ్డి మరోసారి జబర్దస్త్ కామెడీ చేేశారు.
జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని కితాబిచ్చిన మధుసూదన్ రెడ్డి…ఆ తర్వాత పంచ్ లు వేశారు. చిరంజీవి కొత్త సినిమాకు టికెట్లు దొరకడం కష్టమని, అదే తరహాలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరకడం కూడా కష్టంగా మారిందని మధుసూదన్ అనడంతో సభలో నవ్వులు విరిసాయి.
అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని చెప్పిన మధుసూదన్ రెడ్డి…ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నో అడ్మిషన్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ తమ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికే తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ప్రైవేటుపాఠశాలలపై మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఎస్టీ పాఠశాలలు కూడా బెంచీలు, టీవీ సెట్లతో అద్భుతంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో ప్రతిపక్ష నాయకులు వచ్చి చూడాలని కూడా మధుసూదన్ రెడ్డి కోరండం కొసమెరుపు.
This post was last modified on March 11, 2022 8:35 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…