Political News

ఇండియాలో మ‌రో లాక్ డౌన్.. ప్ర‌ధాని ఫుల్ క్లారిటీ

దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్‌ను స‌డ‌లించేశారు. అన్ లాక్ పేరుతో థియేట‌ర్లు, జిమ్‌లు లాంటివి మిన‌హా అన్నీ తెరిచేశారు. మాల్స్, ఆల‌యాలు.. అన్ని ర‌కాల దుకాణాలూ ఓపెన్ అయిపోయాయి. దీంతో పాటే క‌రోనా కేసులు కూడా విప‌రీతంగా పెరిగిపోయాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో ఇండియా పీక్స్‌ను చూస్తోందిప్పుడు. ఒక్క రోజుల రెండు వేల‌కు పైగా మ‌ర‌ణాలంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్ డౌన్ పెట్ట‌క త‌ప్ప‌ద‌ని.. కేంద్రం ఈ విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఆలోచిస్తోంద‌ని.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డ‌వ‌చ్చ‌ని ఒక ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతోంది. కొంద‌రైతే వ‌రుస‌గా మూణ్నెల్ల పాటు లాక్ డౌన్ పెట్ట‌బోతున్నార‌ని కూడా ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇలాంటి ప్ర‌చారానికి తెర‌దించుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని.. అన్ని రాష్ట్రాల సీఎంల‌తో బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లాక్ డౌన్ మ‌ళ్లీ విధించే అవ‌కాశాలు ఎంత‌మాత్రం లేవ‌ని.. ఈ విష‌య‌మై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సీఎంల‌ను కోరారు ప్ర‌ధాని. దేశంలో మ‌ళ్లీ లాక్ డౌన్ విధిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రితో మీడియాతో మాట్లాడ‌తారు అన‌గానే మ‌ళ్లీ లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అనుకుంటున్నారు. ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడ‌కుండా లాక్ డౌన్ విధించ‌డం జ‌ర‌గ‌దు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించండి. దేశంలో నాలుగు ద‌శ‌లో లాక్ డౌన్ ముగిసింది. ప్ర‌స్తుతం అన్ లాక్ 1.0 న‌డుస్తోంది. అన్ లాక్ 2.0 గురించి మ‌న‌మంతా చ‌ర్చించుకోవాలి అని ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎంతో స్ప‌ష్టం చేశారు.

suman

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

7 minutes ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

12 minutes ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

27 minutes ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

1 hour ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

2 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

3 hours ago