Political News

ఇండియాలో మ‌రో లాక్ డౌన్.. ప్ర‌ధాని ఫుల్ క్లారిటీ

దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్‌ను స‌డ‌లించేశారు. అన్ లాక్ పేరుతో థియేట‌ర్లు, జిమ్‌లు లాంటివి మిన‌హా అన్నీ తెరిచేశారు. మాల్స్, ఆల‌యాలు.. అన్ని ర‌కాల దుకాణాలూ ఓపెన్ అయిపోయాయి. దీంతో పాటే క‌రోనా కేసులు కూడా విప‌రీతంగా పెరిగిపోయాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో ఇండియా పీక్స్‌ను చూస్తోందిప్పుడు. ఒక్క రోజుల రెండు వేల‌కు పైగా మ‌ర‌ణాలంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్ డౌన్ పెట్ట‌క త‌ప్ప‌ద‌ని.. కేంద్రం ఈ విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఆలోచిస్తోంద‌ని.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డ‌వ‌చ్చ‌ని ఒక ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతోంది. కొంద‌రైతే వ‌రుస‌గా మూణ్నెల్ల పాటు లాక్ డౌన్ పెట్ట‌బోతున్నార‌ని కూడా ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇలాంటి ప్ర‌చారానికి తెర‌దించుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని.. అన్ని రాష్ట్రాల సీఎంల‌తో బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లాక్ డౌన్ మ‌ళ్లీ విధించే అవ‌కాశాలు ఎంత‌మాత్రం లేవ‌ని.. ఈ విష‌య‌మై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సీఎంల‌ను కోరారు ప్ర‌ధాని. దేశంలో మ‌ళ్లీ లాక్ డౌన్ విధిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రితో మీడియాతో మాట్లాడ‌తారు అన‌గానే మ‌ళ్లీ లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అనుకుంటున్నారు. ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడ‌కుండా లాక్ డౌన్ విధించ‌డం జ‌ర‌గ‌దు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించండి. దేశంలో నాలుగు ద‌శ‌లో లాక్ డౌన్ ముగిసింది. ప్ర‌స్తుతం అన్ లాక్ 1.0 న‌డుస్తోంది. అన్ లాక్ 2.0 గురించి మ‌న‌మంతా చ‌ర్చించుకోవాలి అని ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎంతో స్ప‌ష్టం చేశారు.

This post was last modified on June 17, 2020 7:28 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago