Political News

అదే నిజమైతే.. కేసీఆర్ సర్కారుకు షాకే

అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో పలు విమర్శల్ని ఎదుర్కొంటోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఎవరెన్ని చెప్పినా.. మాయదారి రోగానికి ముందస్తుగా నిర్దారణ పరీక్షలు చేయమంటే ససేమిరా అంటూ.. అత్యంత పొదుపును ప్రదర్శిస్తోంది. తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాల్లో రోజువారీగా విస్తారంగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. అందుకు భిన్నంగా వ్యవహరించటంలో ఉన్న మర్మం ఏమిటన్నది కేసీఆర్ అండ్ కోకు మాత్రమే అర్థమవుతుందన్న విమర్శలు ఉన్నాయి.

రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచటం మంచిదన్న వినతుల నేపథ్యంలో తెలంగాణ సర్కారు పది రోజుల వ్యవధిలో 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 30అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు.

పలువురు అనుమానితుల్ని పరీక్షలు జరిపిన నేపథ్యంలో వచ్చిన ఫలితాలు షాకింగ్ గా ఉన్నాయని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం నిర్వహించిన 1231 శాంపిల్స్ లో పాజిటివ్ సంఖ్య ఏకంగా 17 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో జరిపిన నిర్దారణ పరీక్షల్లో ఇంత పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదైంది లేదన్న మాట వినిపిస్తోంది.

మంగళవారం నుంచి మొదలు పెట్టిన నిర్దారణ పరీక్షల విషయానికి వస్తే.. తొలి రోజున సుమారు 5400 టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన మొత్తం ఫలితాలు రావాల్సి ఉంది. ఒకవేళ.. ఈ శాంపిల్ టెస్టులకు కానీ పదిహేను శాతం చొప్పున పాజిటివ్ లు వస్తే.. కేసీఆర్ సర్కారుకు షాకింగ్ గా మారటం ఖాయమంటున్నారు.

అదే జరిగితే.. తెలంగాణ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొనే వీలుంది. మిగిలిన రాష్ట్రాల మాదిరి ముందస్తు పరీక్షల్ని ఆచితూచి చేయటం ద్వారా ఇప్పుడున్న పరిస్థితికి కారణమైందన్న భావన ప్రజల్లోనే కాదు.. ప్రతిపక్షాలు సైతం ఆరోపించే అవకాశం ఉంది.

This post was last modified on June 17, 2020 1:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

2 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

4 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

5 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

8 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

12 hours ago