Political News

వంగ‌వీటి సైన్యం ఏక‌మైతే.. ఎవ‌రికైనా చుక్క‌లే

కాపు నాయ‌కుడు, పేద‌ల ఆత్మీయ బంధువు దివంగ‌త వంగ‌వీటి రంగా  మోహ‌న్ రంగా స్మృత్య‌ర్థం.. విజ‌య‌వాడ‌లోని శ్రీన‌గ‌ర్ కాల‌నీలో రంగా కాంస్య విగ్రహాన్ని రంగా, రాధా మిత్ర‌మండ‌లి అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కాంస్య విగ్ర‌హాన్ని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న రాధాకృష్న‌.. ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వంగ‌వీటి రంగా సైన్యం.. త‌లుచుకుంటే.. ప్ర‌భుత్వం కూలిపోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. వంగ‌వీటి సైన్యాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని .. ప‌రోక్షంగా ఆయ‌న వైసీపీని హెచ్చ‌రించారు.

వంగవీటి రంగా ఒక్క జిల్లాకే పరిమితం కాదని.. ఆయన్ను ఏపీ మొత్తం ఆరాధిస్తుందని  వంగవీటి రాధా అన్నారు.  రంగా కాంస్య విగ్రహాన్ని రాధా ఆవిష్కరించిన ఈ కార్య‌క్ర‌మానికి ముందు.. భారీ ర్యాలీతో, బాణా సంచాతో అభిమానులు రాధాకు ఘ‌న‌ స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఏ పదవి, హోదా ఇవ్వని గౌరవం తనకు ‘రంగా గారి అబ్బాయి’గా దక్కిందని రాధా అన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను ఏ పార్టీ కూడా ఆశించిన విధంగా వాడుకోలేద‌ని.. క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేదనే ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తన తండ్రిని కులమతాలకు అతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఏపీ నలుమూలలా ఆయన పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధని అన్నారు. రంగా అభిమానులు అంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న రంగా శిష్యులు, అభిమానులు విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలని కోరారు.

పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చని, రంగా కుమారుడిగా ప్రజలు చూపించే అభిమానం అనంతమని స్పష్టంచేశారు. ఈ జన్మకు రంగా కొడుకు అనే ఆదరణే తనకు సంతృప్తినిస్తుందన్నారు. ఏపీలోని విజయవాడ శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు.

This post was last modified on February 28, 2022 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago