కాపు నాయకుడు, పేదల ఆత్మీయ బంధువు దివంగత వంగవీటి రంగా మోహన్ రంగా స్మృత్యర్థం.. విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో రంగా కాంస్య విగ్రహాన్ని రంగా, రాధా మిత్రమండలి అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కాంస్య విగ్రహాన్ని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధాకృష్న.. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా సైన్యం.. తలుచుకుంటే.. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. వంగవీటి సైన్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని .. పరోక్షంగా ఆయన వైసీపీని హెచ్చరించారు.
వంగవీటి రంగా ఒక్క జిల్లాకే పరిమితం కాదని.. ఆయన్ను ఏపీ మొత్తం ఆరాధిస్తుందని వంగవీటి రాధా అన్నారు. రంగా కాంస్య విగ్రహాన్ని రాధా ఆవిష్కరించిన ఈ కార్యక్రమానికి ముందు.. భారీ ర్యాలీతో, బాణా సంచాతో అభిమానులు రాధాకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఏ పదవి, హోదా ఇవ్వని గౌరవం తనకు ‘రంగా గారి అబ్బాయి’గా దక్కిందని రాధా అన్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటి వరకు తనను ఏ పార్టీ కూడా ఆశించిన విధంగా వాడుకోలేదని.. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రిని కులమతాలకు అతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఏపీ నలుమూలలా ఆయన పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధని అన్నారు. రంగా అభిమానులు అంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న రంగా శిష్యులు, అభిమానులు విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలని కోరారు.
పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చని, రంగా కుమారుడిగా ప్రజలు చూపించే అభిమానం అనంతమని స్పష్టంచేశారు. ఈ జన్మకు రంగా కొడుకు అనే ఆదరణే తనకు సంతృప్తినిస్తుందన్నారు. ఏపీలోని విజయవాడ శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు.
This post was last modified on February 28, 2022 8:45 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…