సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ తన పొలిటికల్ కెరీర్కు గుడ్బై చెప్పబోతున్నారా? రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి తన తనయుడి రంగప్రవేశం కోసం ఆయన తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని, తన కొడుకును బరిలో దించుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజకీయాలకు, వయసుకు పెద్దగా సంబంధం లేకపోయినా బొత్స సత్యనారాయణ ప్రస్తుతమున్న రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మేలని భావిస్తున్నారని తెలిసింది. గత రెండున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బొత్స ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో సుదీర్ఘ కాలం తన మనుగడ కొనసాగదని ఆయన అనుకుంటున్నారని సమాచారం. అందుకే తాను తప్పుకుని తన తనయుడు బొత్స సందీప్ను రంగంలోకి దించాలని భావిస్తున్నారని తెలిసింది.
విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణకు తిరుగులేదు. గతంలో కాంగ్రెస్లో ఇప్పుడు వైసీపీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే హుందాగా పక్కకు తప్పుకుని తన కొడుకు రాజకీయ జీవితాన్ని నిర్మించాలని ఆయన అనుకుంటున్నట్లు టాక్. వచ్చే ఎన్నికల్లో సందీప్ను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారని అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు వైద్య వృత్తిని అభ్యసించినప్పటికీ సందీప్ కూడా రాజకీయాలపై ఆసక్తితో ఉన్నారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్, విద్య, ఉపాధి కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ధీర పేరుతో ఓ సంస్థను నెలకొల్పి కొవిడ్ సమయంలో జిల్లావ్యాప్తంగా సేవలు అందించారు. బొత్స యువసేనను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
This post was last modified on February 24, 2022 3:59 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…